బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్జాం’.. గంటకు 12కిమీ వేగంతో..
తీవ్ర తుపాను మిగ్జాం (Cyclone Michaung) మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల సమీపంలోకి తుపాను వచ్చినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్జాం’ కదులుతోందని చెప్పారు.
విశాఖపట్నం: తీవ్ర తుపాను మిగ్జాం (Cyclone Michaung) మరికొద్ది గంటల్లో తీరం దాటనుంది. బాపట్ల సమీపంలోకి తుపాను వచ్చినట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. బాపట్ల తీరానికి అత్యంత దగ్గరగా ‘మిగ్జాం’ కదులుతోందని చెప్పారు. మంగళవారం ఉదయం గంటకు 7కి.మీ వేగంతో కదిలిన తుపాను.. ప్రస్తుతం 12కి.మీ వేగంతో వస్తోందని తెలిపారు. విశాఖలో మీడియాతో సునంద మాట్లాడారు.
‘‘తుపాను ఉత్తర దిశగా కదులుతూ బాపట్ల వద్ద తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు భారీగా ఎగసిపడతాయి. తుపాను తీరం దాటి భూభాగంపైకి వచ్చాక క్రమంగా బలహీనపడుతుంది. మరో 24 గంటలపాటు రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె తెలిపారు. తుపాను నేపథ్యంలో బాపట్ల, నిజాంపట్నం, మచిలీపట్నంలో 10వ నంబర్ ప్రమాదహెచ్చరిక కొనసాగుతోంది. కాకినాడలో 9, విశాఖ, కళింగపట్నంలో 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశారు. తుపాను ప్రస్తుతం బాపట్లకు 60కి.మీ దూరంలో ఉంది. ‘మిగ్జాం’ ప్రభావంతో బాపట్ల, సూర్యలంక తీరాల్లో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలు కన్నా.. ఆదాయమే మిన్నా?
గాలివాన దుమారంతో సోమవారం ముంబయిలోని అనేక హోర్డింగులు, బోర్డులు, ఫ్లెక్సీలు, రేకుల నిర్మాణాలు గాలికి కొట్టుకుపోయాయి. పాత ముంబయిలోని గొటక్పర్ ప్రాంతంలో 100 అడుగుల అక్రమ హోర్డింగు అక్కడున్న పెట్రోలు బంకుపై కుప్పకూలింది. -
దొంగ ఆలోచనలకు రెక్కలు
ఒకే ఒక్కడు.. 110 రోజులు.. దేశవ్యాప్తంగా దాదాపు 200 విమానాల్లో ప్రయాణం.. ఇంత బిజీగా దేశంలోని నగరాలు చుట్టేసే ఇతను ఓ దొంగ అంటే ఎవరైనా నమ్ముతారా..? కేవలం విమాన ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు చేస్తున్న ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. -
స్మార్ట్గా చదివెయ్
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకూడదనే ఉద్దేశంతో.. విద్యాశాఖ వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టింది. లిటరసీ క్లౌడ్ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ఆకర్షణీయమైన తెలుగు, ఆంగ్ల పుస్తకాలను రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కదిలొచ్చిన ఓటు.. కలిసొచ్చేది ఎటు!
-
బిర్యానీ బిల్లు ఎక్కువైందంటూ జవాన్ల వీరంగం
-
కాయ్ రాజా కాయ్!.. కూటమిదే అధికారమని జోరుగా పందేలు
-
నాడు ఫిఫోతోనే చెల్లింపులు.. ఇప్పుడెందుకు లేవు?
-
నాందేడ్-విశాఖ ఎక్స్ప్రెస్కు గ్రీన్ఛానల్.. ఓటర్ల కోసం దూసుకెళ్లిన రైలుబండి
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు