జవాన్ల మృతి కలచివేసింది: బండి సంజయ్
లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్
హైదరాబాద్: లద్దాఖ్లోని గాల్వన్ లోయ సమీపంలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్ల కుటుంబాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడం తనను కలచివేసిందని అన్నారు. జవాన్లు అత్యుత్తమ ధైర్యాన్ని ప్రదర్శించి దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. వారి ధైర్య సాహసాలు, త్యాగాలను ఎన్నటికీ మరువమన్నారు.
మాతృభూమి సేవలో జాతి రక్షణ కోసం ప్రాణాలర్పించిన భరత మాత ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వీర సైనికుడు కర్నల్ సంతోష్ బాబుతో పాటు వీర మరణం పొందిన జవాన్లకు ఆయన నివాళులర్పించారు. సైనికుల సేవలను భారత్ ఎప్పటికీ స్మరించుకుంటుందని బండి సంజయ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!