ప్రవేశ పరీక్షల వాయిదాపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో రేపట్నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది
హైదరాబాద్: తెలంగాణలో రేపట్నుంచి జరగాల్సిన ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైదరాబాద్లో లాక్డౌన్ పెట్టే అవకాశాలపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు కోరింది.
రేపటి నుంచి ఈనెల 17వరకు తెలంగాణలో ప్రవేశపరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ ఖరారు చేసింది. రేపు పాలీసెట్, పీజీ ఈసెట్ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ ఎంట్రన్స్ పరీక్షలతో పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలు కూడా వాయిదా వేయాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. హైదరాబాద్లో లాక్డౌన్ పెట్టే అవకాశముందని పత్రికల్లో చూశాం... దీనిపై స్పష్టత ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ను కోరింది. హైదరాబాద్లో లాక్డౌన్ విధిస్తే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. పిటిషన్పై విచారణ జరపాలంటే లాక్డౌన్పై స్పష్టత ఇవ్వాలని సూచించింది. లాక్డౌన్ కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ఈ సందర్భంగా ఏజీ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉందని వెల్లడించారు. ప్రవేశ పరీక్షల వాయిదాపై సీఎస్తో చర్చించి మధ్యాహ్నం నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. దీంతో విచారణ మధ్యాహ్నం 2.30కి వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. -
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వయసు మీద పడినా.. ఓటు బాధ్యత మరవలేదు
వయో వృద్ధులు ఓటుకు కదిలారు. ఎండను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు