Viveka Murder case: అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో మంగళవారం విచారణ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత కోర్టును ఆశ్రయించారు.

Updated : 09 Jun 2023 12:42 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనుంది. వివేకా హత్య కేసులో అవినాష్‌ ప్రధాన కుట్రదారు అని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్‌కే మద్దతిస్తోందని తెలిపారు. సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఏప్రిల్‌ 24 తర్వాత సీబీఐ నాలుగుసార్లు సమన్లు జారీ చేసిందని.. అవినాష్‌ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని సునీత న్యాయవాది  పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని