Vizag: జీవీఎంసీ అత్యుత్సాహం.. 92 మంది సచివాలయ కార్యదర్శులకు నోటీసులు

నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 

Published : 08 Mar 2024 17:39 IST

విశాఖపట్నం: నగరంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ 92 మంది వార్డు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలైన ఆసరా, అమ్మఒడి, చేయూత, తోడు, పేదలందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి.. క్షేత్రస్థాయిలో సర్వే, లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని 5వ జోనల్‌ కమిషనర్‌ ఈ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 20వ తేదీలోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. మార్చి నెల జీతం నిలిపివేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై ఆందోళన చెందుతున్న కార్యదర్శులు జోనల్‌ కమిషనర్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు