36 రఫేల్ యుద్ధ విమానాలు.. లక్ష్యం 2022
భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆర్కేయస్ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు
హైదరాబాద్: భారత వాయుసేనలోకి 2022 నాటికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆర్కేయస్ బదౌరియా వెల్లడించారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ పరేడ్(సీజీపీ)కి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఫ్రాన్స్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ల స్వీకరణ ప్రక్రియలో జాప్యం జరిగిందన్నారు. రఫేల్ యుద్ధ విమానాలను సాధ్యమైనంత తొందరగా వాయుసేనలో ప్రవేశ పెట్టేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనుకున్న సమయానికే వాటిని తీసుకొస్తామన్నారు. భారత్-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్లో పరిస్థితులపై ప్రశ్నించగా.. ఇరు దేశాల మధ్య సమస్య చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు పక్షాల బలగాల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సరిహద్దులో చైనా బలగాల మోహరింపుపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులకు తగినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు.
భారత ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు 2016లో ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. దీని విలువ రూ.59 వేల కోట్లు. కొనుగోలు చేసిన మొత్తం రఫేల్ ఎయిర్క్రాఫ్ట్లను 2022, ఏప్రిల్ నాటికి వాయుసేనకు అప్పగిస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫిబ్రవరిలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. -
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వయసు మీద పడినా.. ఓటు బాధ్యత మరవలేదు
వయో వృద్ధులు ఓటుకు కదిలారు. ఎండను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!