Karimnagar: ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది

కరీంనగర్‌ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమంచి దానిని ఎట్టకేలకు పట్టుకున్నారు.

Updated : 06 Feb 2024 15:39 IST

మానకొండూరు: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. అటవీశాఖ సిబ్బంది, పోలీసులు తీవ్రంగా శ్రమించి దానిని బంధించారు. మంగళవారం తెల్లవారుజామున ఆలయం వద్ద చెట్టు పైకి ఎక్కి కూర్చున్న భల్లూకాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు. వరంగల్‌ నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించారు. మత్తుమందు ఇచ్చేలోపు అది అక్కడి నుంచి పరారైంది. ఆ తర్వాత వలలు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అటవీశాఖ వాహనంలో తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని