Bapatla: నలుగురు పోలీసు అధికారులపై వేటు

ఓటరు జాబితా సవరణలో జోక్యం చేసుకున్నారన్న కారణంతో నలుగురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు.

Updated : 24 Oct 2023 04:04 IST

పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరులో నలుగురు పోలీసు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఓటరు జాబితా సవరణలో జోక్యం చేసుకున్నారన్న కారణంతో మార్టూరు సీఐ, పర్చూరు, యద్దనపూడి, మార్టూరు ఎస్సైలను వీఆర్‌ (వేకెన్సీ రిజర్వ్)కు పంపారు. ఎన్నికల అధికారుల నుంచి ఫాం-7 సమాచారం తీసుకున్నారన్న కారణంతో వారిపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని