Guinness World Records: ఆయనే అత్యంత పెద్ద వయస్కుడు..!
ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టో రికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్ మార్క్వెజ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు.
లండన్: ప్రపంచంలోనే జీవించి ఉన్న అత్యంత పెద్ద వయస్కుడిగా ప్యూర్టోరికోకు చెందిన ఎమిలీయో ఫ్లోర్జ్ మార్క్వెజ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. 112 ఏళ్ల 326 రోజుల వయసులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈ మేరకు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ బుధవారం ప్రకటించింది. ఇంతకుముందు ఇదే రికార్డు రొమేనియాకు చెందిన డుమిత్రు కొమెస్కు పేరిట ఉండగా ఆయన 2020, జూన్ 27న మృతి చెందారు. అప్పటికి ఆయన వయసు 111 ఏళ్ల 219 రోజులు. ఆయన మరణం తర్వాత ఆ రికార్డును అధిగమించే వ్యక్తి కోసం వచ్చిన దరఖాస్తులను గిన్నిస్ అధికార ప్రతినిధులు పరిశీలించారు. ఈ క్రమంలో కొమెస్కు కన్నా మార్క్వెజ్ మూడు నెలల ముందు జన్మించినట్లు నిర్ధారణ చేసుకున్నారు. గిన్నిస్ బుక్లో అత్యంత పెద్ద వయస్కుడిగా ఆయన పేరును ఖరారు చేసి ధ్రవీకరణ పత్రం అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లను ప్రపంచానికి పరిచయం చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ క్రెయిగ్ గ్లెండే చెప్పుకొచ్చారు.
ప్యూర్టోరికోలోని కరోలినాలో 1908లో మార్క్వెజ్ జన్మించారు. తన తల్లిదండ్రులకు 11 మంది సంతానంలో ఆయన రెండోవారు. స్నేహతులకు ఆయన డాన్ మిలోగా సుపరిచితుడు. చిన్నతనంలో మూడేళ్లపాటు మాత్రమే పాశాలకు వెళ్లిన ఆయన అనంతరం తన కుటుంబానికి చెందిన చెరకు తోటలో పనిచేసేవారు. ఆయన భార్య ఆండ్రియా ప్రెజ్ డి ఫ్లోర్జ్ 2010లో.. 75 ఏళ్ల వయసులో మరణించారు. తన దీర్ఘాయువు వెనక ఉన్న రహస్యమేంటని అడగ్గా.. దయాగుణం కలిగి జీవించడమేనని ఆయన సమాధానమిచ్చినట్లు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ‘నా తండ్రి నన్ను ప్రేమతో పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని చెప్పాడు. అందరికీ మంచి చేయాలని నాతో పాటు నా తోబుట్టువులకు కూడా నేర్పించారు’ అని మార్క్వెజ్ చెప్పినట్లు వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆమె కన్నీళ్లకు నా హృదయం ముక్కలైంది’: గవర్నర్పై ఆరోపణల వేళ దీదీ వ్యాఖ్య
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!