KTR in Davos: తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో ష్నైడర్ ఎలెక్ట్రిక్ కార్యకలాపాల విస్తరణ
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన బృందం పర్యటన కొనసాగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
దావోస్: తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆయన బృందం పర్యటన కొనసాగుతోంది. దావోస్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ మేరకు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. తాజాగా తెలంగాణలో కార్యకలాపాలు కొనాసాగిస్తోన్న ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనుంచి. ఇందుకోసం రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తయారీ యూనిట్ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైన సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ ప్రకటన చేశారు.
ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న తమ యూనిట్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అడ్వాన్స్డ్ లైట్ హౌస్ అవార్డును పొందిందని రిమోంట్ తెలిపారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న స్నేహపూర్వక విధానాలను దృష్టిలో పెట్టుకొని తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు రిమెంట్ వెల్లడించారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో రెండో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్ల చెప్పారు. కొత్త ప్లాంట్ నుంచి ఎనర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తులను తయారు చేయబోతున్నట్లు రిమోంట్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను పెట్టుబడులకు రాజధానిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్.. తన తయారీ పరిశ్రమను విస్తరించడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ష్నైడర్ ఎలెక్ట్రిక్ అదనపు తయారీ యూనిట్తో వెయ్యి మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ష్నైడర్ ఎలెక్ట్రిక్ కంపెనీకి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటింది. ఈ మేరకు ఎండీ ఎన్వీఎస్రెడ్డి వెల్లడించారు. -
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వివేకా హత్య కేసు.. సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్, ఉదయ్కుమార్రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్.. ప్రభుత్వ అప్లికేషన్లకు ఇకపై లేబుల్స్
-
ఉగ్రదాడులకు కుట్ర.. ఉక్రెయిన్ ‘ఏజెంట్’ను చంపిన రష్యా
-
శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
-
ఓటీటీలోకి వచ్చేసిన త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఎన్నికల నేపథ్యంలో.. కేజ్రీవాల్కు బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం - సుప్రీంకోర్టు