విద్యార్థే, కానీ ట్వీట్తో సమస్యపై గెలిచాడు!
ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్న ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తేవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులోభాగంగా ట్విటర్ వేదికగా నిత్యం ఎంతోమంది తమ ఇబ్బందుల్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
భువనేశ్వర్: ప్రస్తుతం సమాజంలో నెలకొంటున్న ఎన్నో సమస్యల్ని వెలుగులోకి తేవడంలో సామాజిక మాధ్యమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో భాగంగా ట్విటర్ వేదికగా నిత్యం ఎంతోమంది తమ ఇబ్బందుల్ని అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకుని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలా ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ పాఠశాల విద్యార్థి తనకు ఏర్పడిన బస్సు సమస్యను ట్విటర్ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్కు చెందిన సాయి అన్వేష్ స్థానికంగా ఎంబీఎస్ పాఠశాలలో చదువుతున్నాడు. తాను పాఠశాలకు ఉదయం 7:30గంటల కల్లా చేరుకోవాలి. కానీ వెళ్లాల్సిన బస్సు మాత్రం తన ప్రాంతానికి 7:40గంటలకు వస్తోంది. దీంతో తాను పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని పేర్కొంటూ.. ఈ విషయాన్ని భువనేశ్వర్ క్యాపిటల్ అర్బన్ రవాణా శాఖ(సీఆర్యూటీ)కు, సీఆర్యూటీ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుణ్ బాత్రాకు ట్విటర్లో ట్యాగ్ చేశాడు.
ఈ క్రమంలో విద్యార్థి ట్వీట్కు అరుణ్ స్పందిస్తూ.. ‘సాయికి కలిగిన ఇబ్బందిని తొలగిస్తూ.. ఇకనుంచి ఉదయం 7గంటలకే తన ప్రాంతానికి బస్సు వస్తుంది’ అని హామీ ఇచ్చారు. అనంతరం బస్సు వేళల్లో మార్పులు చేస్తూ సీఆర్యూటీ సైతం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా బస్సు ఈ రోజు ఉదయం 7గంటలకే ఆ విద్యార్థి ప్రాంతానికి రాగా.. సాయి బస్సు ఎక్కిన ఫొటోను అరుణ్ ట్వీట్లో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కాగా అధికారుల స్పందనపై పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
సాగు చట్టాలను నిలిపివేయండి.. లేదా స్టే ఇస్తాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. -
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వయసు మీద పడినా.. ఓటు బాధ్యత మరవలేదు
వయో వృద్ధులు ఓటుకు కదిలారు. ఎండను లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. -
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (14/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కీలక మ్యాచ్లో పోరాడి ఓడిన లఖ్నవూ.. ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక