శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో రాములోరి కల్యాణం
కాశీలోని రామభద్రేంద్ర సరస్వతి స్వామి స్థాపించిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం బుధవారం వైభవంగా.........
వారణాశి: కాశీలోని రామభద్రేంద్ర సరస్వతి స్వామి స్థాపించిన శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ కల్యాణం బుధవారం వైభవంగా జరిగింది. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది భక్తులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు జరిగింది. ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వెంకట సుందర శాస్త్రి, ఉమ దంపతులు పీటల మీద కూర్చుని కల్యాణం జరిపించారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఏటా నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుండగా.. కొవిడ్ నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే వేడుకలు నిర్వహించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సీవీబీ సుబ్రహ్మణ్యం, సోమయాజులు, పొంగలి కిషోర్ కుమార్, ఎ.ఎ. నరసయ్య, పురుషోత్తం, నరసింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!