Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. కాసుల కక్కుర్తి..గాడి తప్పిన గస్తీ
శాంతిభద్రతల నిర్వహణలో కీలకమైన రాత్రి పోలీసు గస్తీ నవ్వులపాలవుతోంది. కొందరు సిబ్బంది బిర్యానీ ప్యాకెట్లు.. ఐస్క్రీమ్లు.. పండ్లరసాలకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గ్రేటర్వ్యాప్తంగా పలు ఐస్క్రీమ్ పార్లర్లు నడుపుతున్న నిర్వాహకులు కొన్ని ఠాణాలకు నెలకు రూ.2లక్షలు మామూళ్లు పంపుతున్నారనే ఆరోపణలుస్తున్నాయి. దక్షిణ మండలంలోని పర్యాటక ప్రాంతానికి సమీపంలో ఉండే ఓ ఠాణా పరిధిలో రాత్రివేళ కాలనీ మధ్య మందుబాబులు వీరంగం చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించట్లేదని తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2. క్షణాల్లో కమ్మేసి.. నిర్దయగా ఈడ్చేసి..
రాజధాని రైతులపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. శాంతియుతంగా దీక్ష చేసేందుకు సన్నద్ధమైన వారిని నానా దుర్భాషలాడారు. దీక్షా శిబిరాన్ని కమ్మేసి.. కర్కశంగా ఈడ్చి పారేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు తేడా లేకుండా జులుం ప్రదర్శించారు. తుళ్లూరు దీక్షా శిబిరం చెంత వందలాదిగా మోహరించి భయానక వాతావరణం సృష్టించారు. ఇలాంటి నిర్బంధాలు.. బెదిరింపులకు వెరవబోమని త్యాగధనులు నినదించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3. విద్యుత్తు ధర్మం ఇదేనా ?
విద్యుత్తు డిమాండ్ అమాంతం పెరగడంతో కరెంట్ తీగలు తట్టుకోలేకపోతున్నాయి. ఎండలు ముదరడంతో ఏసీల వాడకంతో భారీగా లోడ్ పెరిగింది. రోజులో ఏ దశలోనూ 3 వేల మెగావాట్లు తగ్గడం లేదు. ఇటీవల గరిష్ఠంగా 3,760 మెగావాట్లను తాకింది. దీంతో తరచూ ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి. రోజులో చాలా ప్రాంతాల్లో ఐదారుసార్లు కరెంట్ పోతూ వస్తోందని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4. అంతకు మించి.. అమాంతం పెంచి
పుస్తక విలువకు.. బహిరంగ మార్కెట్ విలువకు ఎక్కువ తేడా ఎక్కడుంది..? భూములకు గిరాకీ ఎక్కడ ఎక్కువ? దస్తావేజు రిజిస్ట్రేషన్లు అధికంగా ఎక్కడ జరుగుతున్నాయి...? ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది..భవిష్యత్తులో ఇంకా ఆస్కారం ఎక్కడుంది..? రానున్న రోజుల్లో భూములకు గిరాకీ ఏ ప్రాంతాల్లో పెరిగే వీలుంది..? వ్యవసాయ భూములు.. వ్యవసాయేతరగా ఏ చోట మారుతున్నాయి....? లేఅవుట్లు ఎక్కడెక్కడ వేశారు... ఇలా భిన్నకోణాల్లో కసరత్తు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5. స్కాన్ చేస్తే పాఠాలు ప్రత్యక్షం
ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే పది, ఇంటర్ పుస్తకాలు జిల్లాకేంద్రాలకు చేరుకుంటున్నాయి. ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా నిత్యం బస్సుల్లో నిల్వలు సమకూరుతున్నాయి. పుస్తకాలపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. విద్యార్థులు దీనిని చరవాణి ద్వారా స్కాన్ చేస్తే పాఠ్యాంశాలు వస్తాయి. ఎస్సెస్సీ, ఇంటర్ తరగతుల వారికి ఈ విధానం అమలుతో మరింత సౌలభ్యం చేకూరనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6. ఐఐటీహెచ్ చదువు.. సివిల్స్ కొలువు
ప్రతిష్ఠాత్మక యూపీఎస్సీ పరీక్షల్లో తమ పూర్వ విద్యార్థులు ముగ్గురు ఉత్తమ ర్యాంకులు సాధించడం ఐఐటీ హైదరాబాద్కు గర్వకారణమని ఆ సంస్థ డైరెక్టర్ ఆచార్య బీఎస్మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న విద్యార్థులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతకూ వీరు ప్రేరణగా నిలిచారని ప్రశంసించారు. డాక్టర్ ముద్రికాఖండేల్వాల్, ఆచార్యులు ఎస్ సూరియ ప్రకాశ్, ఉమాశంకర్, శివ్గోవింద్సింగ్, రాంజీ విజేతలకు అభినందనలు తెలిపారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు దేశ ప్రజలకు సేవ చేసేందుకు ముందడగు వేయడం గొప్ప విషయమన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7. రిటైర్మెంట్కు ఇంకా సమయముంది
ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. తనకిదే చివరి ఐపీఎల్ అని ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో మహి మరోసారి స్పందించాడు. రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి తనకు ఇంకా 8-9 నెలల సమయం ఉందని చెప్పాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8.ఐటీ కొలువులు తగ్గి.. విదేశీ చదువులకు మొగ్గు!
ప్రాంగణ నియామకాల్లో కొలువులకు ఎంపికై ఏడాది దాటినా కంపెనీల నుంచి పిలువులు రావడం లేదు.. చదువు పూర్తయి సంవత్సరం అయినా శుభవార్త చెవిన పడటం లేదు. ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అధికసంఖ్యలో విద్యార్థులు విదేశీవిద్యకు మొగ్గు చూపుతున్నారు. ఒకటీ రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత విదేశీవిద్యపై ఆలోచిద్దాం అనుకున్నవారూ ఇక ఆలస్యం చేయకుండా వీసాలకు దరఖాస్తు చేస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9. 1.50 లక్షల మందికి.. 4.05 లక్షల ఎకరాలు
అటవీ భూముల్ని సాగు చేస్తున్న గిరిజనులకు పోడు పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సచివాలయంలో గురువారం సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, హరితహారం, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ తదితర అంశాలపైనా సమీక్షిస్తారు. ప్రధానంగా పోడు పట్టాల పంపిణీని జూన్ 24 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10. పరీక్షను అర్ధం చేసుకుంటే..దాదాపు గెలిచినట్టే!
వైఫల్యాలు ఎదురైనపుడు కుంగిపోకుండా వాటినుంచి పాఠాలు నేర్చుకుంటేనే పురోగతి సాధ్యం! జాతీయ స్థాయిలో జరిగే అత్యున్నత పరీక్షలు రాసే అభ్యర్థులు తాము చేసిన లోపాలు గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం తప్పనిసరి. తాజా సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాల్లో అఖిలభారత స్థాయిలో మూడో ర్యాంకు సాధించింది.. తెలంగాణ విద్యార్థిని నూకల ఉమా హారతి! ఆమెతో ‘చదువు’ముఖాముఖీ.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్