Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఒకే టికెట్తో 56 రోజుల ప్రయాణం.. దీని గురించి తెలుసా?
నిత్యం లక్షల సంఖ్యలో ప్రజలు తమ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం సాగడం అందుకు ఒక కారణం. అయితే పుణ్యస్థలాలు, ఉద్యోగం, వ్యాపారం అంటూ నెలలో వందల మైళ్ల దూరం ప్రయాణించే వారూ ఉంటారు. అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇండియన్ రైల్వే (Indian Railways) ప్రత్యేకమైన టికెట్లను అందిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ‘ఇండియా’ కూటమికి తొలి పరీక్ష.. 6 రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ (Bypoll) మంగళవారం కొనసాగుతోంది. భాజపా (BJP)కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిన 28 విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా (INDIA bloc)’ భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ సాధ్యమైనంతవరకు కలిసే పోరాడుతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఉప ఎన్నికలు విపక్ష కూటమికి తొలి పరీక్షగా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. దేశం పేరు ఇక ‘భారత్’? తీర్మానం చేసే యోచనలో కేంద్రం..!
మన దేశం పేరును ఆంగ్లంలోనూ ‘ఇండియా (India)’ నుంచి ‘భారత్ (Bharat)’గా మార్చనున్నారా? రాజ్యాంగాన్ని సవరించి తీర్మానం చేయనున్నారా? ప్రస్తుత రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అసలేం జరిగిందంటే.. భారత్ అధ్యక్షతన ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. షార్ట్కట్ కోసం.. గ్రేట్వాల్ ఆఫ్ చైనానే తవ్వేసిన ఘనులు..!
గోడ అంటేనే.. అడ్డంకి.. అదే ఏకంగా 21,196 కిలోమీటర్ల గోడ ఉంటే.. అందుకే.. ఈ అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లడమే కర్తవ్యం అనుకున్నారో ఏమో.. ఏకంగా చారిత్రక ‘గ్రేట్ వాల్’ (Great Wall)నే ఓ చోట తవ్వేశారు కొందరు ఘనులు. ఈ ఘటన చైనా(China)లోని ఉత్తర షాక్సి ప్రావిన్స్లో చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. రూ.10 కోట్లు అవసరం లేదు.. పది రూపాయల దువ్వెన చాలు..: ఉదయనిధి స్టాలిన్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ స్వామీజీ ఉదయనిధిపై (Udhayanidhi Stalin) బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి (Sanatan Dharma ) వ్యతిరేకంగా వ్యాఖలు చేసిన ఉదయనిధి తలపై రూ.10 కోట్ల రివార్డు ప్రకటించారు. ఆ పని ఎవరూ చేయడానికి ముందుకు రాకపోతే.. తానే చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. విష్ణు ప్రకాశ్ లిస్టింగ్ అదుర్స్.. ఒక్కో లాట్పై రూ.9,600 లాభం!
ఇన్ఫ్రా కంపెనీ ‘విష్ణు ప్రకాశ్ ఆర్ పంగ్లియా లిమిటెడ్’ షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి (Vishnu Prakash R Punglia Limited Listing). ట్రేడింగ్ ఆరంభంలోనే షేర్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. ఇష్యూ ధర రూ.99తో పోలిస్తే దాదాపు 67 శాతం లాభంతో నమోదు కావడం విశేషం. ఈ కంపెనీ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. 30ల్లో పదవీ విరమణ ప్రణాళిక.. ‘టూ ఎర్లీ’ అంటారా? ఇది చదవండి..
పదవీ విరమణ (Retirement) ప్రతి ఉద్యోగి జీవితంలో భాగం. పదవీ విరమణ అనంతరం ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పదవీ విరమణ అనంతర జీవితమూ సౌకర్యంగా ఉండాలని ఆశిస్తారు. కానీ దాని కోసం పొదుపు (Retirement plan) చేయడంలో మాత్రం అలస్యం చేస్తారు. 35-36 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఇంకా పదవీ విరమణకు చాలా సమయం ఉందిలే నిదానంగా పొదుపు చేయొచ్చని అనుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ప్రపంచంతో పాటే భారత్లోనూ ఐఫోన్ 15 అన్బాక్స్?
ఐఫోన్ 15 (iPhone 15) విడుదల గురించి చాలా మంది ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దాదాపు నెల తర్వాత ఐఫోన్ భారత్కు వస్తుంటుంది. కానీ, ఈసారి ఆ గ్యాప్ను దాదాపు పూర్తిగా తగ్గించే ప్రయత్నాల్లో యాపిల్ ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఇదే జరిగితే.. యావత్ ప్రపంచంతో పాటే భారత్ కూడా కొత్త ఐఫోన్ను అన్బాక్స్ చేయనుంది! పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పంజాగుట్ట-కూకట్పల్లి మార్గంలో భారీగా వరద నీరు
నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పంజాగుట్ట నుంచి కూకట్పల్లి వెళ్లే వాహనదారులు అవస్థలు పడ్డారు. అమీర్పేటలోని మైత్రీవనం, మూసాపేట మెట్రోస్టేషన్ వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. ఎర్రగడ్డ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వర్షపు నీరు నిలిచిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. యువతిపై ప్రేమోన్మాది దాడి.. బ్లేడ్తో గొంతుకోసి పరారీ
నగరంలోని శ్రీహరిపురంలో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్తో దాడి చేశాడు. నెహ్రూనగర్లో నివాసం ఉంటున్న లతశ్రీ ఇంట్లోకి సోమవారం అర్ధరాత్రి చొరబడిన అదే ప్రాంతానికి చెందిన నేతేటి రామారావు బ్లేడ్తో యువతి గొంతుకోశాడు. గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో యువకుడు జులాయిగా తిరుగుతుండటంతో ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్