Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని తూర్పు, ఈశాన్య జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కట్నం కోసం.. భార్యను బావిలో వేలాడదీసి..!
కాలం మారినా.. ఇంకా కొందరు కట్నం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి కట్నం (Dowry) కోసం తన భార్యను బావిలో వేలాడదీశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నీముచ్ జిల్లాకు చెందిన రాకేశ్ కిర్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, కట్నం తీసుకురావాలంటూ భార్యను నిత్యం వేధించేవాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ఏ పదాలు కించపరిచేలా ఉన్నాయో జగన్ను చెప్పమనండి: పోలీసులతో లోకేశ్
కొంతమంది పోలీసుల తీరుతో ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడిలోని క్యాంప్సైట్కు వెళ్లిన పోలీసులతో లోకేశ్ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. బ్రిటన్ రెండో అతిపెద్ద నగర పాలక సంస్థ దివాలా..!
ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో ఒకటైన బ్రిటన్ (Britain) ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా మంగళవారం బ్రిటన్లోని రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ (Birmingham city council) దివాలా తీసినట్లు ప్రకటించింది. దీని ఆదాయం సుమారు 4.3 బిలియన్ డాలర్లు. ఇది ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇప్పుడు దివాలా తీయడంతో.. అత్యవసరం కాని అన్ని ఖర్చులను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. భారత్తో వాణిజ్య ఒప్పందంపై రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు
భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free trade agreement- FTA)పై బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ (Rishi Sunak) కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం యునైటెడ్ కింగ్డమ్కు మేలు చేసేదైతేనే ఒప్పందానికి అంగీకరిస్తామని మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తెలిపారు. భారత్లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు సునాక్ రానున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ చీఫ్ కన్నుమూత
ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా (Arun Kumar Sinha) కన్నుమూశారు. 61 ఏళ్ల సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మూసీ నదిలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం
మూసీ నదిలో మహిళ మృతదేహం కొట్టుకొచ్చిన ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూసీ పరివాహక ప్రాంతంలో బుధవారం ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్నగర్కు చెందిన వెంకటేశ్ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. 50 ఏళ్లలోపు వారిలో 79% పెరిగిన క్యాన్సర్ కొత్త కేసులు!
క్యాన్సర్ (Cancer) కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఓ అధ్యయనం దీనిపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 50 ఏళ్లలోపు వారిలో కొత్తగా క్యాన్సర్ (Cancer) బారిన పడిన వారి సంఖ్య 79 శాతం పెరిగిందని ప్రముఖ జర్నల్ బీఎంజే ఆంకాలజీ తెలిపింది. గత 30 ఏళ్లకు సంబంధించిన వివరాలను ఇది వెల్లడించింది. స్కాట్లాండ్లోని ఎడిన్బర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని జరిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఆదోనిలో కానిస్టేబుల్ ఆత్మహత్య
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ (32) బుధవారం ఉదయం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు శ్రీనివాస్ నాయక్, విక్రమ సింహ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ఉగ్రసంస్థగా వాగ్నర్.. ప్రకటించనున్న బ్రిటన్..!
రష్యా ఆధీనంలో నడుస్తున్న కిరాయి సైన్యం వాగ్నర్ (Wagner) గ్రూప్ను ఉగ్రసంస్థగా ప్రకటించే అంశాన్ని యూకే (UK) పరిశీలిస్తోంది. అదే జరిగితే యూకే (UK) చట్ట ప్రకారం వాగ్నర్లో చేరడం, దానికి మద్దతు ఇవ్వడం చట్ట విరుద్ధం అవుతుంది. అంతేకాదు.. పార్లమెంట్లో దీనికి ఆమోద ముద్ర పడితే బ్రిటన్ పరిధిలోని వాగ్నర్ ఆస్తులను సీజ్ చేయడానికి అవకాశం లభిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్