Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
Top News in Eenadu.net: ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు..
1. పరకాలలో పోటీచేసేందుకు ప్రతిపక్ష నాయకులకు భయం: మంత్రి కేటీఆర్
ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఎన్నికల్లో జయభేరి మోగించి హ్యాట్రిక్ సాధిస్తారని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నవంబర్.. డిసెంబర్లలో ఎన్నికలొస్తాయని, ఇది పక్కాగా జరుగుతుందని చెప్పారు. కారుకూతలు కూసే వారందరికీ ఇది తెలుసని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పరకాలలో పోటీచేసేందుకు ప్రతిపక్ష నాయకులు భయపడుతున్నారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. చాట్ జీపీటీ, ఏఐ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకోవాలి: చంద్రబాబు
టెక్నాలజీ, పాలసీలు సమర్థంగా అమలు చేయడం ద్వారా పేదరికంలేని సమాజాం సాధ్యమవుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్ఎస్టీ) ఆధ్వర్యంలో ‘డీప్టెక్నాలజీస్’ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ ద్వారా సమాజంలో సమూల మార్పులు తేవచ్చని, అదే తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. పూరీ రథయాత్రకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
పూరీ రథయాత్రకు వెళ్లే భక్తులకు శుభవార్త. పూరీ యాత్రీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 18 నుంచి 22 మధ్య 6 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారో కిషన్రెడ్డి చెప్పాలి: హరీశ్రావు
తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్పై మంత్రి హరీశ్రావు స్పందించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్రెడ్డి రిపీట్ చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలు.. కేంద్రం ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా ఏటా తగ్గుతూ వస్తోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పవన్ కల్యాణ్ చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారులే..!: పేర్ని నాని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చెప్పులూ పోయాయని ఆందోళన చెందుతున్నారని.. చెప్పులు పోయిన సంగతి 3రోజుల తర్వాత ఆయనకు గుర్తుకు వచ్చిందా అని మాజీమంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ‘‘చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారు కానీ, ఆయన పార్టీకి గాజు గ్లాసు గుర్తు పోయింది.. ముందు దాన్ని వెతుక్కోమని చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. పిడిగుద్దులు.. గాల్లోకి ఎగిరిన కుర్చీలు..యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాస
మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. అందులోని రెండు వర్గాలకు చెందిన నేతలు పరస్పరం పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. కుర్చీలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారాయి. ముంబయిలోని కాంగ్రెస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ అధ్యక్షతన యువ నేతలు సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్ ఫార్ములా
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. భారత దౌత్యకార్యాలయాలపై దాడుల కేసులు.. రంగంలోకి ‘ఎన్ఐఏ’!
ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ నాయకుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) అరెస్టుకు భారత్లో ముమ్మర యత్నాలు సాగుతున్న వేళ.. పలుదేశాల్లో ఖలిస్థాన్ అనుకూలురు దేశవ్యతిరేక చర్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ (Indian Consulate)పై ఏకంగా దాడికే దిగారు. కెనడా (Canada)లోనూ దౌత్యకార్యాలయం వద్ద దుశ్చర్యలకు పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను సరళీకరించిన అమెరికా
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు కొద్ది రోజుల ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు అక్కడ శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డు (Green Card) అర్హత నిబంధనలను సరళతరం చేసింది.. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (EAD) కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. జీరో డౌన్పేమెంట్తో ఓలా విద్యుత్ స్కూటర్
ఫేమ్-2 సబ్సిడీలో కేంద్రం కోత పెట్టడంతో విద్యుత్ ద్విచక్ర వాహన ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో ఈవీల కొనుగోళ్లపై వినియోగదారుల నుంచి ఆసక్తి మందగించింది. సేల్స్పై ఈ ప్రభావం పడకుండా కంపెనీలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఆకర్షణీయ వడ్డీ రేట్లకే ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత