Akhilesh Yadav: సార్వత్రికంలో NDA ఓటమికి అఖిలేశ్ ఫార్ములా
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించాలంటే పీడీఏ ఫార్ములాతోనే సాధ్యమని అఖిలేశ్ యాదవ్ అన్నారు. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లేనని చెప్పారు.
లఖ్నవూ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం ఒకే తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఎన్డీయేను ఓడించేందుకు కొత్త ఫార్ములాను సూచించారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు కలిస్తే ఎన్డీయేను సులువుగా ఓడించొచ్చని చెప్పారు. యూపీలోని 80 సీట్లలో ఓడిస్తే భాజపాను పరాజయం పాలు చేయవచ్చన్నారు. ఈ మేరకు లఖ్నవూలో ఎన్డీటీవీ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘‘ఉత్తర్ప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాల్లో భాజపాను ఓడించాలంటే ప్రముఖ జాతీయ పార్టీలు మాకు అండగా ఉండాలి. యూపీలో భాజపాను ఓడిస్తే ఆ పార్టీ పనైపోయినట్లే. అలాగే, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో చూసుకుని దానిబట్టి కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం జరగాలి’’ అని అఖిలేశ్ సూచించారు. ఈ సందర్భంగా విపక్షాల ఐక్యత గురించి ఆయనను ప్రశ్నించగా.. ‘‘80 సీట్లలో ఓడించండి.. భాజపాను సాగనంపండి’’ అని నినాదం ఇచ్చారు.
ఉత్తర్ప్రదేశ్లో 80 లోక్సభ సీట్లు ఉండగా.. 2019 ఎన్నికల్లో ఎస్పీ కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఆ ఐదింట్లో ఇటీవల రామ్పూర్, అజంఘడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కోల్పోయింది. భాజపా ఆ రెండు సీట్లను దక్కించుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తుపై అఖిలేశ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిత్రపక్షాల విషయంలో తామెప్పుడూ నిజాయతీగా వ్యవహరిస్తామని చెప్పారు. సీట్ల గురించి కలహించుకునే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ, శాంతిభద్రతలను కాపాడడంలోనూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విఫలమైందని ఈ సందర్భంగా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్చల్..
ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు. -
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
భారాసకు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ కాంగ్రెస్లో చేరిక అంశం వివాదాస్పదమైంది. -
నేతన్నలూ.. ఆత్మహత్యలు చేసుకోవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోండి
లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ (టీపీసీసీ-ఇఎంసీ) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం శనివారం రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. -
సంక్షిప్త వార్తలు
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ భాజపా రెండో విడత కార్యక్రమం ఆదివారం ప్రారంభమవుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..