దిల్లీ కాలుష్యానికి 95శాతం అదే కారణం!
శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఇతర పరిసర జిల్లాల్లో వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం అక్రమ ఫ్యాక్టరీలు, నిర్మాణాలను అరికట్టేందుకు కేంద్రం శాస్త్రవేత్తలతో కూడిన బృందాలను రంగంలోకి దింపింది.
దిల్లీ: శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఇతర పరిసర జిల్లాల్లో వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం అక్రమ ఫ్యాక్టరీలు, నిర్మాణాలను అరికట్టేందుకు కేంద్రం శాస్త్రవేత్తలతో కూడిన బృందాలను రంగంలోకి దింపింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి 50 బృందాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వాతావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ గురువారం తెలిపారు. ‘కేంద్రం ఏర్పాటు చేసిన బృందాలు అక్రమ కర్మాగారాలు, నిర్మాణాలపై దృష్టి సారిస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాయి. పంట వ్యర్థాల దహనాన్ని కూడా అరికట్టడంపై చర్యలు తీసుకుంటాయి. వ్యవసాయ పనులు తుది దశకు చేరుకున్న వెంటనే పంట వ్యర్థాల దహనంపై పంజాబ్ ప్రభుత్వం సైతం దృష్టి సారించాలి. పంట వ్యర్థాలను కాల్చడం దిల్లీ వాతావరణంపై కేవలం 4శాతమే ప్రభావం చూపుతుంది. కానీ.. అక్రమ కర్మాగారాల నిర్వహణ, నిర్మాణాలు, వాహనాలు తదితరాల నుంచి వచ్చే కాలుష్యమే 95శాతం ఉంటోంది’ అని జావడేకర్ వెల్లడించారు.
పంట వ్యర్థాల కాల్చివేత ప్రభావం దిల్లీపై స్వల్పంగానే ఉంటుందని జావడేకర్ చెప్పిన విషయాన్ని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకించారు. మరి కాలుష్యం పెరగడానికి అది కారణం కాకపోతే ఇటీవల కొద్ది రోజుల ముందు బాగున్న గాలి నాణ్యత అప్పుడే ఎలా మారుతుందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం కేంద్రం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం తగదని విమర్శించారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో శీతాకాలంలో కాలుష్యం స్థాయి తీవ్రత పెరిగితే శ్వాస సమస్యలు మరింత పెరుగుతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా భారత్లో ఇప్పటి వరకు 72 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. మరో 1.10లక్షల మంది మహమ్మారి కారణంగా మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!