కోలుకుంటున్న భారత్..78శాతం రికవరీ!
దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య(రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 38లక్షలకు(78శాతం) పైగా కొవిడ్ రోగులు వైరస్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది.
మూడు రాష్ట్రాల్లోనే యాక్టివ్ కేసులు అత్యధికం!
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 38లక్షలకు(78శాతం) పైగా కొవిడ్ రోగులు వైరస్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది. రోజూ దాదాపు 80వేల మంది కోలుకుంటున్నట్లు పేర్కొంది. దిల్లీలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ.. ‘ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలోనే కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ఐదులో ఒకటో వంతు మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాదాపు 14 రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5వేల లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. మిగతా 18 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు 5వేల నుంచి 50వేల మధ్యలోనే ఉన్నాయి. కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే 50వేల కన్నా ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ మూడు రాష్ట్రాల్లోనే 48శాతం క్రియాశీలక కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సగటు 8.4శాతం ఉందన్నారు. ఆక్సిజన్ సిలిండర్లకు సంబంధించి ఎలాంటి కొరత లేదు. ప్రస్తుతం 6,900 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రాష్ట్రాలు సరైన నిర్వహణ చేపట్టి ఆక్సిజన్ను సమయానికి అందుబాటులో ఉండేలా నిర్దారించుకోవాలి’అని తెలిపారు.
ప్రయోగదశల్లో మూడు వ్యాక్సిన్లు
ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ మాట్లాడుతూ.. ‘దేశంలో మూడు కొవిడ్ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. క్యాడిలా, భారత్ బయోటెక్ మొదటి దశ ప్రయోగాల్ని పూర్తి చేసుకున్నాయి. సీరం ఇనిస్టిట్యూట్ రెండో దశ పూర్తి చేసుకుని (14 ప్రాంతాల్లో 1500 రోగులపై)మూడో దశ అనుమతుల కోసం వేచి చూస్తోంది. వందేళ్ల కింద వివిధ రకాల వైరస్లపై పోరాడేందుకు ప్లాస్మా థెరపీని ఉపయోగించారు. ఇప్పుడు కొవిడ్పై కూడా ఉపయోగిస్తున్నారు. అది ఎంతవరకు సహాయ పడుతుందనే విషయంపై అధ్యయనం జరుగుతోంది. మనం లాక్డౌన్ను ప్రభావవంతంగా చేపట్టడం వల్ల మరణాల రేటును తగ్గించగలిగాం’అన్నారు.
కాగా గడిచిన 24 గంటల్లో 83వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు కాగా1,054 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 49లక్షలకు చేరింది. అయితే మరణిస్తున్న కొవిడ్ రోగుల్లో 70శాతం ఇతర వ్యాధులు ఉన్నవారేనని ఆరోగ్య శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!