Punjab Polls: పంజాబ్ ఎన్నికల ముందు.. డేరా బాబాకు బెయిల్..!
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీవిత ఖైదు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు న్యాయస్థానం 21 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది.
21 రోజులపాటు బయట ఉండనున్న డేరా సచ్చా సౌదా అధినేత
ఛండీగఢ్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జీవిత ఖైదు అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు 21 రోజుల పాటు బెయిల్ లభించింది. శిక్ష ఖరారైన ఖైదీలకు ఇచ్చే ప్రత్యేక సెలవు (Furlough)కింద ఆయన ఈ అవకాశం లభించింది. 2017లో నుంచి రోహ్తక్లోని సునారియా జైలులో ఉన్న ఆయన.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అయితే, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు డేరా బాబా బయటకు రావడం గమనార్హం. అయితే, డేరా బాబా బెయిల్కు ఎన్నికలకు సంబంధం లేదని.. నిబంధనల ప్రకారమే ఆయనకు ఫర్లాఫ్ లభించిందని హరియాణా జైళ్లశాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా స్పష్టం చేశారు.
పంజాబ్లోని మాల్వా ప్రాంతంలో గుర్మీత్ సింగ్తోపాటు ఆయన అనుచరులకు మంచి పట్టుంది. పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లోనూ వారు కీలకంగా ఉంటున్నట్లు మునుపటి ఫలితాలను బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా చాలా అసెంబ్లీ స్థానాల్లో ఆయన ప్రభావం కనిపిస్తుంది. అయితే, రామ్ రహీమ్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ఆయన అనుచరులు మాత్రం స్థానిక నేతల ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, భాజపాతోపాటు అకాలీదళ్ వంటి పార్టీలన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానిక నేతల మన్ననలను చూరగొనేందుకు ఆయా పార్టీలు వారితో సన్నిహితంగా మెలుగుతాయని సమాచారం. ఇలాంటి తరుణంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే గుర్మీత్ సింగ్ జైలు నుంచి బయటకు రానుండడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పంజాబ్లో ఫిబ్రవరి 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇదిలాఉంటే, సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తోన్న గుర్మీత్ సింగ్.. పలువురు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరస్కరించిన వారిని హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు నిరూపితం కావడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రోహ్తక్లోని సునారియా జైలులో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ శిక్ష అనుభవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!