కోటిన్నర మందికి టీకా పూర్తి!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 35దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది వ్యాక్సిన్ పొందినట్లు సమాచారం.
లండన్: ప్రపంచదేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న సమయంలోనూ పలు ప్రాంతాల్లో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా ధాటికి ఐరోపా, అమెరికా దేశాలు వణికిపోతున్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 35దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది వ్యాక్సిన్ పొందినట్లు సమాచారం. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో 50లక్షల మందికి టీకాను అందించారు. అటు చైనాలోనూ 45లక్షల మందికి టీకా ఇచ్చినట్లు సమాచారం. బ్రిటన్, ఇజ్రాయెల్లలో వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడ పదిలక్షల చొప్పున ప్రజలకు టీకా పంపిణీ చేశారు. రష్యా, యూఏఈ దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇక భారీ జనాభా కలిగిన భారత్లోనూ త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదలుకానుంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద ఆక్స్ఫర్డ్(కొవిషీల్డ్), భారత్ బయోటెక్(కొవాగ్జిన్)టీకాలకు అనుమతి పొందిన విషయం తెలిసిందే.
మోడెర్నాకు అనుమతిచ్చిన ఈయూ..
కరోనా వైరస్ విజృంభణకు వణికిపోతోన్న యూరోపియన్ యూనియన్లో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతిస్తున్నట్లు యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థ(EMA) వెల్లడించింది. ఇప్పటికే ఫైజర్ టీకా అందుబాటులోకి రాగా, తాజా నిర్ణయంతో ఈయూలో అనుమతి పొందిన రెండో వ్యాక్సిన్గా నిలిచింది.
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికా, బ్రిటన్లలో ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. అయినప్పటికీ, 27దేశాల ఈయూ మాత్రం వ్యాక్సిన్ అందించడంలో అలసత్వం వహిస్తోందనే విమర్శలు వచ్చాయి. దీంతో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ మరో వ్యాక్సిన్ తీసుకురావడంపై దృష్టి సారించింది. డిసెంబర్ నెలలో ఫైజర్కు అనుమతి ఇవ్వగా, తాజాగా మోడెర్నాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్ దోహదం చేస్తుందనే విశ్వాసం ఉందని ఈఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమెర్ కూక్ అభిప్రాయడ్డారు. అయితే, 45కోట్ల జనాభా కలిగిన ఈయూలో వ్యాక్సిన్ పంపిణీ ఒక సవాల్గానే భావిస్తున్నామని యూరోపియన్ కౌన్సిల్ చీఫ్ చార్లెస్ మైఖేల్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
41 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!
ఆ దేశాలన్నీ మళ్లీ ‘లాక్’డౌన్లోకే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!