అంధుడైన గురువును హేళన చేస్తూ రీల్.. విద్యార్థుల సస్పెన్షన్
సామాజిక మాధ్యమాల పిచ్చిలో యువత తరచూ పెడదోవ పడుతున్నారనేందుకు కేరళలో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. అంధుడైన గురువును కొందరు విద్యార్థులు తరగతి గదిలో ఆట పట్టిస్తూ హేళన చేశారు.
సామాజిక మాధ్యమాల పిచ్చిలో యువత తరచూ పెడదోవ పడుతున్నారనేందుకు కేరళలో జరిగిన ఈ ఉదంతమే నిదర్శనం. అంధుడైన గురువును కొందరు విద్యార్థులు తరగతి గదిలో ఆట పట్టిస్తూ హేళన చేశారు. తమ పిచ్చిచేష్టలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లోనూ పోస్టు చేశారు. ఎర్నాకుళం మహారాజా ప్రభుత్వ కళాశాలలో రాజనీతిశాస్త్రం బోధించే అధ్యాపకుడికి చూపు లేదు. అయినా అదే కళాశాలలో చదువుకొని గురువు స్థాయికి ఆయన ఎదిగారు. ఇటీవల ఓ తరగతి గదిలో పాఠం చెబుతుండగా.. కొందరు విద్యార్థులు ఆయన చుట్టూ చేరి అల్లరి చేశారు. దృష్టిలోపాన్ని ప్రస్తావిస్తూ అవమానకరంగా మాట్లాడారు. ఈ వీడియో వైరల్గా కావడంతో గురువు పట్ల విద్యార్థుల తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. విషయం కళాశాల యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఆ ఘటనకు బాధ్యుడైన ఓ విద్యార్థి నేతతోపాటు ఆరుగురిని సస్పెండ్ చేశారు. బాధిత అధ్యాపకుడు దీనిపై మాట్లాడుతూ..‘‘నేను ఒక గంటసేపు బోధనకు రెండు గంటలు సిద్ధమై తరగతి గదికి వచ్చా. ఆ వీడియో చూసి నా స్నేహితులు, బంధువులు బాధపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కళాశాల పరిధిలోనే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.