హెలికాప్టర్‌లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు.

Updated : 28 Apr 2024 06:40 IST

ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా ఘటన

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఎంసీ అభ్యర్థి తరఫున ర్యాలీకి హాజరుకావడానికి ఆమె కుల్టీ వెళుతుండగా పశ్చిమ బర్ధమాన్‌ జిల్లాలోని దుర్గాపుర్‌లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ‘‘మమతా బెనర్జీ హెలికాప్టర్‌లో సీట్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ప్రస్తుతం బాగానే ఉన్నారు’’ అని ఆమెతో పాటు ప్రయాణిస్తున్న సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఘటన అనంతరం ఆమె కుల్టీ వెళ్లి ఆసన్‌సోల్‌ టీఎంసీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హాకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని