ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
సుప్రీంకోర్టులో దర్యాప్తు సంస్థ ఆరోపణలకు కేజ్రీవాల్ సమాధానం
దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా ఎన్నికలు జరగాలన్న ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై జరిగిన దాడిగా ఈడీ చర్యను ఆయన అభివర్ణించారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో, ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ వ్యవహరించిన తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని దుయబట్టారు. ఈడీ ద్వారా మనీలాండరింగ్ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందనడానికి ఇదో ప్రబల నిదర్శనమని పేర్కొన్నారు. తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకాకపోవడంతోనే కేజ్రీవాల్ను అరెస్టు చేయాల్సి వచ్చిందంటూ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఈడీ పేర్కొనడంపై కేజ్రీవాల్ తిరుగు సమాధానమిచ్చారు.
తనకు వచ్చిన సమన్లకు తగిన విధంగానే స్పందించానని, దర్యాప్తునకు సహకరించడంలేదని ఈడీ కూడా ఎన్నడూ చెప్పలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ఈ కేసుకు కావల్సిన సమాచారాన్ని, పత్రాలను రాత పూర్వకంగా, వర్చువల్ విధానంలో కోరి ఉండవచ్చని పేర్కొన్నారు. లేదంటే అధికారిని పంపించి అయినా కావాల్సిన వివరాలను రాబట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఇవేవీ చేయని ఈడీ....తనను కస్టడీలో ఉంచి విచారిస్తేనే విషయాలను రాబట్టగలమన్నట్లు వ్యవహరించిందని ఆక్షేపించారు. రాజకీయ కార్యకలాపాలు చురుగ్గా జరిగే ఎన్నికల సమయంలో తనను అరెస్టు చేయాల్సిన అవసరమేలేదని, తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టుకు సమర్పించిన సమాధానంలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత వారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో మద్యం పాలసీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి కేజ్రీవాలేనని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో మార్చి 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహాడ్ జైలులో ఉన్నారు.
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఎయిమ్స్ వైద్యుల కమిటీ నివేదిక
తిహాడ్ జైల్లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంగానే ఉన్నారని ఎయిమ్స్ వైద్యుల కమిటీ వెల్లడించినట్లు తెలుస్తోంది. వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్ను పరీక్షించింది. మధుమేహంతో బాధపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుడిని రోజూ వీడియో ద్వారా సంప్రదించే అవకాశం కల్పించాలని ఇటీవల దిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని ఈడీ వ్యతిరేకించింది. అయితే, ఆయనకు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా? ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని పరీక్షించేందుకు వైద్యుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా దిల్లీ ఎయిమ్స్ను కోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ఎయిమ్స్ వైద్యుల కమిటీ శనివారం వీడియో కాన్ఫరెన్స్లో కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు అరగంట పాటు ఎయిమ్స్ వైద్యులు సీఎంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ‘‘కేజ్రీవాల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని వైద్యుల బృందం సూచించింది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసు ఇవ్వాలని తెలిపింది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత మరోసారి కేజ్రీవాల్ను వైద్యుల కమిటీ పరీక్షించనుందని పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.