Fuel Prices: ఇంధన మంట.. ప్రజల తంటా..!
పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడిప్పుడే ఊరట లభించేలా కనిపించడంలేదు. చమురు ధరలు నిర్విరామంగా పెరుగుతూ వాహనదారుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి....
ధరల పెరుగుదలతో సామాన్యుడి ఆపసోపాలు
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడిప్పుడే ఊరట లభించేలా కనిపించడంలేదు. చమురు ధరలు నిర్విరామంగా పెరుగుతూ వాహనదారుడిపై మరింత భారాన్ని మోపుతున్నాయి. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రెండు నెలల కాలంలో లీటర్ పెట్రోల్పై చమురు సంస్థలు దాదాపు రూ.10 పెంచగా.. లీటర్ డీజిల్పై రూ.9 పెంచాయి. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటికి తీయాలంటేనే వాహనదారుడి గుండె గుబేలుమంటోంది. ఎలాంటి వాహనాలూ లేని సాధారణ పౌరుడు కూడా పెట్రో బాదుడుకు బాధితుడిగా మారుతున్నాడు.
దేశంలో ఇంధన ధరల పెరుగుదల ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పౌరులపై ఆర్థిక భారం మోపుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ధరలు తడిసి మోపెడవుతున్నాయి. ఈ పెరుగుదల నిత్యావసరాలపై ప్రభావం చూపుతోంది. దీంతో నిత్యావసరాలైన కూరగాయలు, ఇతర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఔషధాల ధరలు సైతం అమాంతం పెరిగిపోయాయి. దీంతో నిత్యావసరాలు కొనేందుకు పేదలు ఆపసోపాలు పడుతున్నారు. కొన్ని సరకులు కొనేందుకు ముందుకు రావడంలేదు. డీజిల్ ధరల పెరుగుదలతో పలు రాష్ట్రాల్లో బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీలు కూడా పెరిగిపోయాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజులపాటు స్థిరంగా ఉన్న ఆ తర్వాత మే 4 నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం పెట్రోల్పై రూ.35 సైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్ ధరల్ని పెంచగా డీజిల్ ధరలను 33 సార్లు పెంచింది. దీంతో ఇప్పటికే 14 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ దాటింది. రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్లో లీటర్ డీజిల్ ధర కూడా రూ.100 దాటింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతోనే దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోరెన్ అభ్యర్థన నిరర్థకమని తేల్చిన సుప్రీం
నగదు అక్రమ చలామణి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పెట్టుకున్న దరఖాస్తు నిరర్థకమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చింది. -
అనర్హత వేటు సవాలు పిటిషన్ ఉపసంహరణ
హిమాచల్ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు తమపై పడిన అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం ఉపసంహరించుకున్నారు. -
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా
గుజరాత్లోని ఓ కేంద్రంలో నీట్ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంచమహల్ జిల్లాలోని గోధ్రాలో కొందరు అభ్యర్థులు మెరిట్ సాధించేలా ఓ పాఠశాల టీచర్ వారితో అనైతిక ఒప్పందం చేసుకున్నాడు. -
రాష్ట్రపతికి లేఖ రాస్తా
పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ లైంగిక వేధింపుల అంశంలో తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నట్లు బాధితురాలు, రాజ్భవన్ కాంట్రాక్టు ఉద్యోగిని శుక్రవారం తెలిపారు. -
పోలింగ్ శాతాలను 48 గంటల్లో ప్రచురించాలి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే పోలింగ్ కేంద్రాలవారీ ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్సైట్లో ప్రచురించేలా చూడాలని సుప్రీంకోర్టును అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ కోరింది. -
పాక్ను మన దేశం గౌరవించాలి
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇటీవల జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత శాం పిట్రోడా వివాదం చల్లారకముందే, ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ పాకిస్థాన్కు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ఫిర్యాదుల ఉపసంహరణకు ఒత్తిడి తెస్తున్నారు
సందేశ్ఖాలీ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్లో దుమారం కొనసాగుతోంది. ఈ అంశంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ తాజాగా ఆరోపించింది. -
కేజ్రీవాల్కు బెయిల్
సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. -
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం వ్యవహారం బయటకు రావడంలో ప్రజావేగుగా నిలిచిన భాజపా నేత దేవరాజే గౌడపై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!