Rahul Gandhi: ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరి నియంతృత్వ పాలన..!
నిర్మలా సీతారామన్ ఒక మౌత్ పీస్: రాహుల్
దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. విపక్షాలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోన్న తీరు నియంతృత్వ పాలన ప్రారంభాన్ని సూచిస్తోందని రాహుల్ మండిపడ్డారు.
‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, సమాజంలో చోటుచేసుకుంటున్న హింస వంటి ప్రజా సమస్యలు లేవనెత్తకూడదు. వాటిని ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. దశాబ్దాల క్రితం ఒక్కో ఇటుక పేర్చి ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యాన్ని మనముందే కూల్చివేస్తున్నారు. ఈ వ్యవహారశైలి.. నియంతృత్వ పాలన ప్రారంభానికి సూచన. నలుగురైదుగురు ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఇద్దరు ముగ్గురు వ్యాపారుల కోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వ పాలనకు పాల్పడుతున్నారు. నేను ఇలా ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే.. నాపై అంత ఎక్కువ దాడి జరుగుతుంది’ అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆమె ఒక మౌత్ పీస్..
‘కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మౌత్పీస్. దేశ ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందో ఆమెకు అవగాహన ఉందనుకోవడం లేదు’ అని రాహుల్ అన్నారు.
ఇది కుటుంబం కాదు.. ఒక ఐడియాలజీ..
‘ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని నేను వ్యతిరేకిస్తాను. నా కుటుంబం ప్రాణత్యాగాలు చేసింది. సిద్ధాంతం కోసం పోరాడినప్పుడు ఇది మా బాధ్యత. ఇది ఒక కుటుంబం కాదు. ఇది ఒక ఐడియాలజీ. హిట్లర్ కూడా ఎన్నికల్లో గెలిచేవాడు. ప్రతిసారి ఆయన ఎన్నికల్లో విజయం సాధించేవాడు. జర్మనీ వ్యవస్థలన్నింటిని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. మొత్తం వ్యవస్థను నాకు అప్పగించండి. ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నారో చూపిస్తాను’ అని రాహుల్ అన్నారు.
ఈడీని కించపర్చడం ఆపండి: భాజపా
రాహుల్ వ్యాఖ్యలపై భాజపా నేతలు మండిపడ్డారు. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం ఈడీని కించపర్చడం మానండి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యయిక పరిస్థితిని విధించినట్లే.. రాహుల్ మీడియా, ఈడీని బెదిరిస్తున్నారు’అని కాంగ్రెస్ విమర్శలను భాజపా తిప్పికొట్టింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PV Sindhu : పీవీ సింధుకు డేవిడ్ వార్నర్ స్పెషల్ విషెస్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Taiwan: ఆక్రమణ కోసమే చైనా సన్నాహాలు
-
Movies News
Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్ బాబు’.. సూపర్ స్టార్కు తారల విషెస్
-
Sports News
ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
-
Politics News
Bihar: తేజస్వీతో కలిసి గవర్నర్ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్ తప్పదా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Andhra news: కుర్చీ ఆమెది.. పెత్తనం ‘ఆయన’ది