Supreme Court: మణిపుర్ హింస.. మహిళా మాజీ జడ్జీలతో కమిటీ ఏర్పాటు
మణిపుర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి.. ప్రభావితమైన వారికి సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది.
దిల్లీ: మణిపుర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించి సుప్రీం కోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మహిళా మాజీ న్యాయమూర్తులతో కూడిన కమిటీని నియమించింది. జమ్మూ కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ నేతృత్వంలోని ఈ కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) షాలినీ పీ జోషి, జస్టిస్ ఆశా మేనన్లు ఉంటారని పేర్కొంది. రాష్ట్రంలో చట్టబద్ధపాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
మణిపుర్ హింసకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరై గతవారం సుప్రీం ధర్మాసనం కోరిన నివేదికలను అందించారు. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ రాజీవ్ సింగ్ కూడా ధర్మాసనం ముందు హాజరయ్యారు. రాష్ట్రంలో హింస, వాటి నివారణకు ఇప్పటివరకు అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను సుప్రీం ధర్మాసనానికి వివరించారు. హింసాత్మక ఘటనల దర్యాప్తునకు జిల్లా ఎస్పీల నేతృత్వంలో ఎస్ఐటీ (SIT)లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం మణిపుర్లో హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, వాటి పర్యవేక్షణ కోసం పలు కీలక సూచనలు చేసింది. ‘మణిపుర్ మహిళలపై జరిగిన అమానుష ఘటనలో నమోదైన 11 ఎఫ్ఐఆర్ల దర్యాప్తునకు సంబంధించి.. సీబీఐలోకి వివిధ రాష్ట్రాలకు చెందిన డిప్యూటీ ఎస్పీ స్థాయి ఐదుగురు అధికారులను డిప్యుటేషన్పై తీసుకురావాలి. వీరంతా అక్కడి సీబీఐ అధికారుల పరిధిలోనే పనిచేయాలి. ఇలా సీబీఐ చేపట్టే దర్యాప్తు మొత్తం పర్యవేక్షణను మాజీ ఐపీఎస్ దత్తాత్రేయ పడ్సల్గీకర్ చూస్తారు. సీబీఐకి బదిలీ చేయని కేసులను 42 ప్రత్యేక బృందాలు (SIT) దర్యాప్తు చేస్తాయి. ఏడుగురు డీఐజీ ర్యాంక్ అధికారులు వీటన్నింటి దర్యాప్తులను పర్యవేక్షించాలి. వీరంతా మణిపుర్ కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులే ఉండాలి’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. అయితే, మహిళలపై జరిగిన వేధింపులపై సీబీఐ దర్యాప్తు చేస్తోన్న 11 ఎఫ్ఆర్లు కాకుండా అదనంగా నమోదైతే.. వాటిని ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో జిల్లా స్థాయి సిట్లు దర్యాప్తు చేస్తాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు హైకోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన ‘కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్: ది అల్టిమేట్ మ్యానువల్ ఫర్ మామ్స్ టు బి’ పుస్తకంలో బైబిల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టఫర్ అంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. -
ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ చూపించారు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనందబోస్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను ఆయన సాధారణ పౌరులకు చూపించారని ఆరోపించారు. -
ఆయనకు 84.. ఆమెకు 66
మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చించోలి రహీమాపుర్కు చెందిన విఠల్ ఖండారే (84)కు ఆయన కుమారులు, కుమార్తెలు 66 ఏళ్ల వృద్ధురాలితో ఘనంగా రెండోపెళ్లి జరిపించారు. -
సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకున్న రస్కిన్ బాండ్
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముస్సోరీలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. -
4 నిమిషాల్లో ఒక మైలు పరుగెత్తే అథ్లెట్లకు దీర్ఘాయుష్షు
నాలుగు నిమిషాల్లోనే ఒక మైలు దూరం పరుగులు తీసే అథ్లెట్లు.. వారి సాధారణ ఆయుష్షు కన్నా ఐదేళ్లు ఎక్కువగా జీవించే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
సైబర్ నేరాలపై కేంద్రం ఉక్కుపాదం
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల్లో టెలికాం వనరుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) కీలక నిర్ణయం తీసుకుంది. -
వారణాసి గంగా హారతిలో అమిత్ షా, యోగి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం వారణాసిలోని దశాశ్వమేధ్ ఘాట్లో జరిగిన గంగా హారతికి హాజరయ్యారు. -
చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. -
ఓ ఆదివాసీ ప్రశ్నకు వ్యంగ్యంగా బదులిచ్చానంతే
రత్లాం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కాంతిలాల్ భురియా తాజాగా చేసిన ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ
సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్) మార్కెట్లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. -
నింగిలో రంగురంగుల అరోరాలు
చాలా బలమైన సౌర తుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం.. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
-
అతివలు మెచ్చేలా.. అందరూ వచ్చేలా: మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
-
జగన్ సభలకేనా బస్సులు.. ఓటేసే వారికి ఉండవా!
-
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
-
ఓటరు స్లిప్పు అందలేదా?.. ఇలా చేయండి