నేనెలా చేస్తానోనని భయపడ్డా
‘‘రీమేక్ అనగానే కచ్చితంగా పోలికలు వస్తుంటాయి. కథని, నటీనటులు పోషించే పాత్రల్ని మాతృకతో పోల్చి చూస్తుంటారు. కాబట్టి ఒరిజినల్ వెర్షన్లోని అందాన్ని చెడగొట్టకుండా.. మనదైన శైలిలో సరికొత్తగా చూపించడం అటు దర్శకుడికి, ఇటు నటీనటులకు సవాలే’’ అంది నటి నభా నటేష్. తొలి దశ కరోనా తర్వాత వరుస సినిమాలతో ...
‘‘రీమేక్ అనగానే కచ్చితంగా పోలికలు వస్తుంటాయి. కథని, నటీనటులు పోషించే పాత్రల్ని మాతృకతో పోల్చి చూస్తుంటారు. కాబట్టి ఒరిజినల్ వెర్షన్లోని అందాన్ని చెడగొట్టకుండా.. మనదైన శైలిలో సరికొత్తగా చూపించడం అటు దర్శకుడికి, ఇటు నటీనటులకు సవాలే’’ అంది నటి నభా నటేష్. తొలి దశ కరోనా తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేసిన ఆమె.. ఇప్పుడు రెండో దశ తర్వాత ‘మాస్ట్రో’తో వస్తోంది. నితిన్ హీరోగా నటించిన చిత్రమిది. మేర్లపాక గాంధీ దర్శకుడు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 17న ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది నభా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘అంధాధూన్’ బాలీవుడ్కు టర్నింగ్ పాయింట్ లాంటి చిత్రం. అప్పట్లో దీని పేరు చాలా వినిపించింది. అలాంటిది ఈ చిత్ర రీమేక్లో నాకు అవకాశం రావడంతో చాలా ఆనందంగా అనిపించింది. అయితే మొదట్లో నాకు కాస్త భయంగానూ అనిపించింది. ఎందుకంటే మాతృకలో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. ఆ పాత్రని నేనెలా చేయగలను? అని భయపడ్డా. తెలుగు సినిమా ప్రారంభించడానికి ముందు మాతృక చూసినా.. తర్వాత మళ్లీ చూడకూడదనుకున్నా. ఎందుకంటే ఆ ప్రభావం నా నటనపై పడుతుంది’’
‘‘ఇది రీమేక్ అయినా దర్శకుడు తన విజన్తో సినిమాని చాలా కొత్తగా తీశారు. ప్రేక్షకులకి ఓ తెలుగు చిత్రం చూస్తున్న అనుభూతే కలుగుతుంది. నా పాత్ర విషయంలోనూ ఎన్నో మార్పులు చేశారు. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా ఇద్దరి సన్నివేశాలు, పాటలు బాగా వచ్చాయి. తమన్నా నాకెంతో సహకరించింది. ఈ చిత్రానికి నేనే డబ్బింగ్ చెప్పాలి అనుకున్నా. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కుదర్లేదు. తర్వాతి సినిమాల్లో తప్పకుండా నా సొంత గళమే వినిపిస్తా’’.
‘‘ఇది వరకు నుంచే నాకు ఓటీటీ భయం ఉండేది. కరోనా సమయంలో నా రెండు సినిమాలు థియేటర్లలోనే విడుదలయ్యాయి. ఇప్పుడొస్తున్నది మూడోది. కానీ, ఈసారి ఓటీటీలోకి రావడం తప్పలేదు. ఇంకా థియేటర్ల సమస్య అలాగే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో అయితే అందరూ చూసే వీలు కలుగుతుంది. నేను చేసే ప్రతి సినిమా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండేలా చూసుకుంటా. నటిగా నాకు అన్ని రకాల జానర్లు, పాత్రలు చేయాలనుంది. భవిష్యత్ ప్రాజెక్ట్ల గురించి అధికారికంగా ప్రకటించే వరకు చెప్పలేను’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు