Boney Kapoor: శ్రీదేవి మరణం.. డైట్‌ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్‌

శ్రీదేవి (Sridevi) మరణం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్‌ (Boney kapoor). ఉప్పు లేకుండానే ఆమె భోజనం తినేదని ఆయన చెప్పారు.

Published : 03 Oct 2023 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సతీమణి, దివంగత శ్రీదేవి (Sridevi)ని ఉద్దేశించి నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన శ్రీదేవి మరణంపై మాట్లాడారు. నాజుకుగా కనిపించడం కోసం ఆమె స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అయ్యేదన్నారు. ఉప్పు లేకుండా తినొద్దని వైద్యులు వారించినా ఆమె పట్టించుకోలేదన్నారు.

‘‘స్క్రీన్‌పై అందంగా కనిపించడం కోసం శ్రీదేవి తరచూ డైట్‌ చేస్తుండేది. తను స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవుతుందనే విషయం పెళ్లయ్యాకే నాకూ తెలిసింది. సాల్ట్‌ లేకుండా భోజనం తీసుకునేది. దానివల్ల ఆమె నీరసించి పడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఆమెకు లో బీపీ సమస్యలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని వైద్యులు ఎంతగానో చెప్పారు. కానీ ఆమె సీరియస్‌గా తీసుకోలేదు’’

Saba Azad: హృతిక్‌తో ప్రేమాయణం.. అవి నన్నెంతో బాధించాయి: సబా ఆజాద్‌

‘‘శ్రీదేవిది సహజ మరణం కాదు. ప్రమాదవశాత్తు మరణించింది. ఆమె మరణానంతరం దుబాయ్‌ పోలీసులు నన్ను 24 గంటలపాటు విచారించారు. లై డిటెక్టర్‌ పరీక్షలూ చేశారు. భారతీయ మీడియా నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణంగానే నన్ను అన్ని విధాలుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రకోణం లేదని చివరకు వారు నిర్ధారించారు. శ్రీదేవి చనిపోయిన తర్వాత నటుడు నాగార్జున నన్ను కలిశారు. క్రాష్‌ డైట్‌ కారణంగా శ్రీదేవి ఓసారి సెట్‌లో సృహతప్పి పడిపోయిందని, ఆ సమయంలో ఆమె పన్ను కూడా విరిగిందని చెప్పారు’’ అని ఆయన తెలిపారు. 2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్‌కు వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని