RGV: వాళ్లు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు: వర్మ

నట్టి క్రాంతి, కరుణ.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పీఎస్‌లో సీఐ నిరంజన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు....

Published : 29 May 2022 01:45 IST

పోలీసులకు ఫిర్యాదు చేసిన దర్శకుడు

పంజాగుట్ట: నట్టి క్రాంతి, కరుణ.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పంజాగుట్ట పీఎస్‌లో సీఐ నిరంజన్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు అందించారు. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో తన సంతకం ఫోర్జరీ చేశారని అందులో పేర్కొన్నారు. 2020 నవంబర్‌ 30న తన లెటర్‌హెడ్‌ తీసుకొని నకిలీ పత్రాలు సృష్టించి ఫోర్జరీ సంతకంతో వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్లు సృష్టించారన్నారు. ఫోర్జరీ సంతకాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి నిజానిజాలు తేల్చాలని కోరారు. ఏప్రిల్‌లో ‘డేంజరస్‌’ సినిమా విడుదల కావాల్సిందని, నకిలీ పత్రాలతో దావా వేసి సినిమా అడ్డుకున్నారని ఆయన పోలీసులకు వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని