Identity: శరవేగంగా.. ‘ఐడెంటిటీ’

టోవినో థామస్‌, త్రిష జోడీగా అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Updated : 29 Apr 2024 09:30 IST

టోవినో థామస్‌, త్రిష జోడీగా అఖిల్‌ పాల్‌, అనాస్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా సాగుతూ.. రెండో షెడ్యూల్‌ ముగిసింది. ఇందులో కొన్ని కీలకమైన పతాక యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారు. దర్శకద్వయం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. త్వరలో చివరి షెడ్యూల్‌కి వెళ్లనున్నట్టు ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. టోవినో థామస్‌, త్రిషలతో ఉన్న ఓ ఫొటోని జత చేశారు. మరోవైపు టోవినో నటించిన ‘నడికర్‌’ మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని