Kajol: మరోసారి కాజోల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. షారుఖ్ ఫ్యాన్స్ ఆగ్రహం
బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) మరో వివాదంలో చిక్కుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఆమె రెండోసారి ఇలా తన వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముంబయి: బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్టార్ హీరో సినిమానుద్దేశిస్తూ ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సదరు హీరో అభిమానులు నెట్టింట తిడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..
కాజోల్ తాజాగా నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘ది ట్రయల్’ (The Trail). సుపర్ణ్ వర్మ దర్శకుడు. డిస్నీ + హాట్స్టార్ వేదికగా శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుఖ్ ఖాన్ గురించి అడగ్గా.. ‘‘ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. మళ్లీ ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలని ఉంది’’ అని కాజోల్ అన్నారు. అనంతరం ‘ఒకవేళ ఇప్పుడు షారుఖ్ ఎదురైతే.. ఆయన్ని మీరు అడిగే ఒకేఒక్క విషయం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘‘పఠాన్’ (షారుఖ్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్) నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమంటాను’’ అని బదులిచ్చారు. ‘పఠాన్’ కలెక్షన్స్ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
రివ్యూ: ది ట్రయల్.. లాయర్గా కాజోల్ నటన ఆకట్టుకుందా?
షారుఖ్ ఇటీవల నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్’ (pathaan) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినట్లు గతంలో ఆ చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని పేర్కొంది. ఈ సినిమా కలెక్షన్స్ను ఉద్దేశిస్తూ తాజాగా కాజోల్ చేసిన వ్యాఖ్యలు.. కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. ‘పఠాన్’ కలెక్షన్స్ నిజమేనా..? కాదా? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల వ్యవధిలోనే కాజోల్.. తన మాటలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ.. చదువుపై అవగాహన లేని నాయకులు మనల్ని పాలిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఇక, షారుఖ్ - కాజోల్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘బాజీఘర్’, ‘దిల్ వాలే’ వంటి చిత్రాలు ఈ జంటకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్
-
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్