Veera Simha Reddy: బాలకృష్ణ వినయం చూసి ఆశ్చర్యపోయాను..: వీరసింహారెడ్డి నటుడు

బాలకృష్ణ(Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి(Veera Simha Reddy). ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించిన రోహిత్‌ పాఠక్‌ (Rohit Pathak) తన అనుభవాన్ని పంచుకొన్నారు.

Updated : 29 Dec 2022 13:50 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). ఈ చిత్రంలో రోహిత్‌ పాఠక్‌(Rohit Pathak) ఓ కీలక పాత్రలో కనిపంచనున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్‌.. బాలకృష్ణతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే వీరసింహారెడ్డిలో తన పాత్ర గురించి వివరించారు.

‘‘వీరసింహారెడ్డి సినిమాలో నేను నార్త్‌కు చెందిన కాంట్రాక్ట్‌ కిల్లర్‌గా కనిపిస్తాను. నా పాత్ర సినిమాకే కీలకం అవుతుంది. దీనితో సినిమాలోని కథ మొత్తం మలుపు తిరుగుతుంది. తీవ్రమైన ప్రతికారం తీర్చుకునే పాత్ర అది. బాలకృష్ణకు, నాకు మధ్య జరిగే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇంతకు మించి నా పాత్ర గురించి ఎక్కువ వివరాలు చెప్పలేను’’ అన్నారు. ఇక బాలకృష్ణతో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ.. ఆయన వినయం ఆకట్టుకుందని తెలిపారు. ‘‘రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు నేను వెళ్లాను. బాలకృష్ణ దగ్గరకు వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను. వెంటనే ఆయన ‘మీ గురించి నాకు తెలుసు’ అని నవ్వారు. ఆయన అలా చెప్పడంతో నేను ఆశ్చర్యపోయాను. ఆయనతో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’’ అని రోహిత్‌ వివరించారు. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్‌(Shruti Haasan) నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని మూడు పాటలు ఇప్పటికే సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ ‘వీరసింహారెడ్డి’ థియేటర్లలో వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని