Tollywood: వినోదానికి విరామం లేదు మిత్రమా!
విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. ఇక వారం వారం వినోదాల విందు భోజనమే.. ఈ మండు వేసవిలో చల్ల చల్లని వినోదాలతో సేదతీరడమే.. ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్ ఈసారి కాస్త ముందుగానే
విరామం లేదు.. వాయిదాల మాటే లేదు.. ఇక వారం వారం వినోదాల విందు భోజనమే.. ఈ మండు వేసవిలో చల్ల చల్లని వినోదాలతో సేదతీరడమే.. ఇటు ప్రేక్షకులు.. అటు చిత్ర వర్గాలు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూసే వేసవి సినీ మారథాన్ ఈసారి కాస్త ముందుగానే షురూ అయింది. కరోనా పరిస్థితుల వల్ల గడిచిన రెండేళ్లు సినీ క్యాలెండర్లో వేసవి వినోదాల సందడి కనిపించలేదు. ఈసారి వేసవికి కరోనా ముప్పు పూర్తిగా తప్పింది. దీంతో రెండేళ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న బడా చిత్రాలన్నీ బాక్సాఫీస్ ముందు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఫలితంగా ఈసారి కాస్త ముందుగానే సమ్మర్ వినోదాల సందడి మొదలైంది.
ఈ వారం బాక్సాఫీస్ ముందుకు వరుస కడుతున్న సినిమాల్లో పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’తో పాటు అలియా భట్ ‘గంగూభాయి కాఠియావాడీ’, అజిత్ ‘వలిమై’ వంటి పాన్ ఇండియా చిత్రాలున్నాయి. వీటిలో పవన్, అలియాల సినిమాలు శుక్రవారం విడుదల కానుండగా.. అజిత్ చిత్రం గురువారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ మూడు చిత్రాలపైనా ఇటు సినీప్రియుల్లోనూ అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తొలి, మలి కరోనా ఉద్ధృతుల తర్వాత తెలుగు చిత్రసీమలో సినిమాల సందడి బాగానే కనిపించింది. ఇటు కోలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీల్లో అంతగా జోష్ కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ విరామం తర్వాత వస్తున్న ఈ అగ్రతారల సినిమాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ముఖ్యంగా ‘గంగూభాయి కాఠియావాడీ’, ‘వలిమై’ వంటి చిత్రాలు మిగతా అన్ని భాషల్లోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. దీంతో ఇప్పుడు వీటికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన దక్కుతుందోనని చిత్ర వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. వీటికి మంచి స్పందన దక్కి, ప్రేక్షకులు మునుపటిలా వరుస కడితే.. రాబోయే అగ్రతారల చిత్రాలకు గొప్ప భరోసా దొరికినట్లవుతుంది.
మార్చి ఊరిస్తోంది..
ఈ వేసవి సీజన్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నెల మార్చి. సినీప్రియుల్ని ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మార్చి 4న శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’, కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. ఆ మరుసటి వారం ఒక్కరోజు వ్యవధిలోనే సూర్య ‘ఈటీ’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. వీటిలో ముందుగా తెరపై మెరిసేది సూర్య సినిమానే. ఇది మార్చి 10న విడుదల కానుంది. ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీమ్’ వంటి విజయాల తర్వాత సూర్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రమిది. 1970ల కాలం నాటి ఇటలీ నేపథ్యంగా సాగే విభిన్నమైన ప్రేమకథతో రూపొందించారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక సినీప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న థియేటర్లలో సందడి చేయనుంది. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటించారు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ఇందులో అల్లూరి పాత్రను చరణ్ పోషించగా.. భీమ్ పాత్రలో తారక్ నటించారు. దాదాపు రూ.400కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలోనూ అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఏప్రిల్.. తగ్గేదే లే
ఏప్రిల్ తొలి వారం వచ్చేదెవరన్నది ఇంత వరకు తేలకున్నా.. వరుణ్ తేజ్ ‘గని’ ఏప్రిల్ 8న విడుదల కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. బాక్సింగ్ ఆట నేపథ్యంగా సాగే కథతో అల్లుకున్న చిత్రమిది. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఏప్రిల్ 14న యష్ ‘కేజీఎఫ్ 2’తో బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించారు. ఇదే తేదీకి విజయ్ ‘బీస్ట్’ విడుదల కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక. విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాపై దక్షిణాదిలో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇదే వారంలో ఏప్రిల్ 15న ‘రామారావు ఆన్ డ్యూటీ’తో వినోదాలు పంచనున్నారు కథానాయకుడు రవితేజ. శరత్ మండవ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో రవితేజ నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తుది దశ చిత్రీకరణలో ఉంది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన తొలి సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆయన తొలిసారి తన తనయుడు చరణ్తో కలిసి నటించడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
మేలో.. ఇటు మహేష్ అటు వెంకీ
మార్చి, ఏప్రిల్ తరహాలోనే మేలోనూ వెండితెరపై అగ్రతారల సందడి కనిపించనుంది. మహేష్బాబు నటించిన ‘సర్కారు వారి పాట’, వెంకటేష్ - వరుణ్ తేజ్ల ‘ఎఫ్3’ ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మే తొలి వారం వచ్చేదెవరన్నది ఇంత వరకు తేలకున్నా.. ఏప్రిల్ 12న ‘సర్కారు వారి పాట’ రాక ఖాయమైంది. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి విజయం తర్వాత మహేష్ నుంచి వస్తున్న చిత్రమిది. పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఇందులో మహేష్ బ్యాంక్ అధికారిగా కనిపించనున్నారు. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మే 20న ‘పక్కా కమర్షియల్’తో వినోదాలు పంచనున్నారు కథానాయకుడు గోపీచంద్. ‘ప్రతిరోజూ పండగే’ వంటి విజయం తర్వాత మారుతి నుంచి వస్తున్న చిత్రమిది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో ఉంది. మే 27న వెంకటేష్ - వరుణ్ తేజ్ల ‘ఎఫ్3’, అడివి శేష్ ‘మేజర్’ చిత్రాలు బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలు మే 27న విడుదల కానున్నట్లు ఆయా చిత్ర బృందాలు ఇటీవలే ప్రకటించాయి. ‘ఎఫ్2’కు సీక్వెల్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమే ‘ఎఫ్3’. ఈ రెండో భాగంతో మూడు రెట్ల వినోదాలు పంచిస్తామని ఆ చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అడివి శేష్ ‘మేజర్’పైనా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాధవన్ నెగెటివ్ షేడ్స్లో నటించిన ‘షైతాన్’ ఓటీటీలోకి రానుంది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
సెట్లోకి అప్పుడే!
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తదుపరి సినిమా మహేశ్బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. -
లెక్కలు సరిచేసే రక్షకుడు
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. -
‘కుబేర’లో నాగ్ ఇలా!
నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్రావు నిర్మిస్తున్నారు. గురువారం ఈ చిత్రంలో నాగార్జునకు సంబంధించిన ఫస్ట్లుక్ వీడియోని విడుదల చేసింది చిత్రబృందం. -
మండు వేసవిలో హాయిగా నవ్వించే చిత్రం
‘‘పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాల్ని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు అల్లరి నరేశ్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని మల్లి అంకం తెరకెక్కించారు. -
‘హౌస్ఫుల్ 5’.. ‘జాలీ ఎల్ఎల్బీ 3’
‘బడేమియా ఛోటేమియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హౌస్ఫుల్ 5’. -
ప్రభుదేవా షూటింగ్ షురూ
‘ముక్కాల ముక్కాబులా..’ ఇప్పటికీ సినీప్రేమికుల్ని అలరిస్తున్న గీతమిది. ఇందులో ప్రభుదేవా డ్యాన్స్, ఏఆర్. రెహమాన్ సంగీతం అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ఏఆర్ఆర్పీడీ6(వర్కింగ్ టైటిల్)’ అనే సినిమా రూపొందుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. -
రిపబ్లిక్ డేకి ‘లాహోర్ 1947’?
ప్రత్యేకమైన రోజున వారి చిత్రాల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఇప్పుడదే పనిలో బిజీగా ఉంది ‘లాహోర్: 1947’ చిత్రబృందం. -
ఈటీవీ విన్లో ప్రణయ విలాసం
‘ప్రేమలు’ సినిమాలో తన నటనతో సినీప్రియులను మెప్పించింది మలయాళ కథానాయిక మమితా బైజు. ఆమె, అర్జున్ అశోకన్ జంటగా నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. నిఖిల్ మురళి తెరకెక్కించారు. -
చాలా సన్నివేశాలు షాక్కు గురి చేస్తాయి
‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్ వై.కె తెరకెక్కించారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..