Ambati Rambabu: మాకు కక్షసాధింపులు అవసరం లేదు: మంత్రి అంబటి
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేస్తున్నాం. మళ్లీ జగనే ఎందుకు కావాలి అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం. మాకు కక్షసాధింపులు అవసరం లేదు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి? ఆధారాలున్నాయి కాబట్టే చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు’’ అని అంబటి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.