విజయసాయీ..పరువు తీసుకోవద్దు: ఏపీ భాజపా
ఏపీలో కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై అధికార వైకాపా.. భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా మధ్య ట్వీట్ల ప్రవాహం సాగుతోంది. భాజపా రాష్ట్ర
అమరావతి: ఏపీలో కరోనా టెస్ట్ కిట్ల కొనుగోలు వ్యవహారంపై అధికార వైకాపా.. భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా మధ్య ట్వీట్ల ప్రవాహం సాగుతోంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర భాజపా గట్టి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డిని ‘సూట్కేస్ రెడ్డి’ అని సంబోధిస్తూ భాజపా అధికారిక ట్విటర్లో పోస్టు చేసింది. తాజాగా విజయసాయి రెడ్డిపై ఉన్న కేసుల జాబితాను ట్విటర్లో ఉంచింది. ‘కాస్త కళ్లజోడు తుడిచి పెట్టుకుని చూడండి.. ఇది ఏపీ భాజపా.. కరోనా వచ్చి ఇప్పుడు రాష్ట్రం క్వారంటైన్లో ఉంటే.. తాను చేసిన పనులతో విజయసాయి రెడ్డి 2012లోనే క్వారంటైన్లో ఉన్నారు’ అని వ్యాఖ్యానించింది. ‘పైత్యంతో ఉన్న కాస్త పరువును తీసుకోకండి. ఇవి మీ డిగ్రీలు కాదు.. నేర ఘనతలు’ అంటూ కేసుల జాబితాను ట్విటర్లో పోస్టు చేసింది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!