TRS Sarpanch: తెరాస సర్పంచ్పై కక్ష.. ఆమె కారు, ట్రాక్టర్కు నిప్పు!
సర్పంచ్పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..
మిర్దొడ్డి: సర్పంచ్పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆమె కారు, ట్రాక్టర్కు నిప్పంటించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అక్బర్పేటలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ విషయంపై అధికార తెరాసకు చెందిన సర్పంచ్ స్వరూప మాట్లాడుతూ తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ ఘటనపై భూంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దుండగులను గుర్తించి చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్