TRS Sarpanch: తెరాస సర్పంచ్‌పై కక్ష.. ఆమె కారు, ట్రాక్టర్‌కు నిప్పు!

సర్పంచ్‌పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు..

Updated : 26 Sep 2022 11:13 IST

మిర్‌దొడ్డి: సర్పంచ్‌పై కక్ష కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆమె కారు, ట్రాక్టర్‌కు నిప్పంటించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డి మండలం అక్బర్‌పేటలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ విషయంపై అధికార తెరాసకు చెందిన సర్పంచ్‌ స్వరూప మాట్లాడుతూ తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ ఘటనపై భూంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దుండగులను గుర్తించి చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు