Vijayasai Reddy: విడదల రజినిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం!
పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమీక్షించారు.
గ్రూపు రాజకీయాలు చేయొద్దని మంత్రికి హితవు
నరసరావుపేట టౌన్, న్యూస్టుడే: పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమీక్షించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో బుధవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రి రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, జాన్సైదా వర్గాలను వేరు చేసి పార్టీని బలహీన పరిచారని రజినిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో సఖ్యతగా ఉండటంలేదని, ప్రజలను దూరం చేసుకున్నారంటూ ఐప్యాక్ ఇచ్చిన నివేదికపై ప్రశ్నించారు. అక్కడి పరిస్థితులపై ఇతర నేతలను ఆరా తీశారు. అయితే తనపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్న అసంతృప్త వర్గాలు విజయసాయిరెడ్డిని కలవనివ్వకుండా మంత్రి రజిని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. గురువారం నిర్వహించే నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో మంత్రి రజినితో తాడోపేడో తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు