అంబటి, అనిల్‌కుమార్‌లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు

ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు.

Published : 19 Apr 2024 05:51 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్‌కుమార్‌లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు గురువారం ఆ పార్టీ నేతలు వర్ల రామయ్య, బుచ్చిరాంప్రసాద్‌, ఏఎస్‌ రామకృష్ణ, మన్నవ సుబ్బారావులు ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని