Kishan Reddy: 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తాం: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లతో కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కార్యాలయంలో జెండా ఎగురవేసి మాట్లాడారు. రాష్ట్రంలో భారాస రోజురోజుకు కనుమరుగవుతోందన్నారు. హామీలను నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ లేదని విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని కిషన్రెడ్డి తెలిపారు.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ విశ్వ నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణకు రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల్లో చేసి తీరతామన్నారు. వాటిని అమలు చేయకుండా ఆయన తెలంగాణకు ఎలా వస్తారు?. హామీలు అమలు చేయలేదు కానీ... పెద్ద పెద్ద ప్రకటనలు, సభలు పెడుతున్నారు’’ అని కిషన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
-
బద్వేలులో భూబకాసురులు...ఆ బావబామ్మర్దులు!
-
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
-
రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
-
ప్రైవేటు ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే భవిష్యత్తుకు ఇంకేమీ మిగలదు