Mamata Benarjee: ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై దీదీ కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దిల్లీలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.
దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా ఏకమైన విపక్ష పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రధాని అభ్యర్థిత్వంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో 2024 ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామన్నారు. భాజపా (BJP) ను ఓడించమే లక్ష్యంగా సీట్ల పంపకంతో పాటు పలు సమస్యల్ని తమ కూటమిలోనే పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా నరేంద్ర మోదీ(PM Modi)యే ప్రధాని అవుతారంటూ భాజపా చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందించిన దీదీ.. అది అంత తేలిక కాదన్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్లో భాజపా ప్రభావం పెరుగుతోందంటూ విలేకర్లు ప్రస్తావించగా.. ‘భాజపా బలంగా లేదు.. అలాగే, మేం కూడా బలహీనంగా ఉన్నాం. దీన్ని అధిగమించేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. హిందీ బెల్ట్, ఇతర ప్రాంతాల మధ్య వివక్షతో చూడటం నాకు ఇష్టంలేదు’ అన్నారు.
ఒకే రోజు 78 మంది ఎంపీలపై సస్పెన్షన్
బెంగాల్లో ఆ మూడు పార్టీల మధ్య పొత్తు సాధ్యమే!
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కచ్చితంగా సాధ్యమే అవుతుందని మమత వ్యాఖ్యానించారు. కృష్ణానగర్ సీటు అంశాన్ని తమ పార్టీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయిస్తుందని.. మహువా మొయిత్రాకే తన పూర్తి మద్దతు అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్ష ఎంపీలను పెద్ద ఎత్తున సస్పెండ్ చేయడంపైనా దీదీ స్పందించారు. భాజపా భయానికి ఈ చర్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. భాజపా భయపడుతోంది గనకే ఉభయసభల్లో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. -
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు
జనసేన (Janasena) అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి మాజీ మంత్రి, వైకాపా నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె క్రాంతి ఖండించారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే యూసీసీకి మద్దతు
‘ముస్లిం మత పెద్దల అంగీకారం, ఏకాభిప్రాయం లేకుండా యూసీసీకి సంబంధించిన అంశాలకు వైకాపా మద్దతు ఇవ్వదు. మా పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్మోహన్రెడ్డి ఈ విషయమై స్పష్టంగా చెప్పారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజు 3 నామినేషన్లు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలి రోజు గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారి (ఆర్వో), నల్గొండ జిల్లా కలెక్టరు దాసరి హరిచందనకు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM