Rajnath Singh: ఆయన పేరు వింటే నేరస్థులకు వణుకే..: రాజ్నాథ్ వ్యాఖ్యలు
యూపీలోని మహారాజ్గంజ్లో ఏర్పాటు చేసిన ఆదిత్యనాథ్కు మత గురువైన అవైద్యనాథ్ విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ......
యోగిని ప్రశంసల్లో ముంచెత్తిన కేంద్రమంత్రి
మహారాజ్గంజ్: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఆయన నిజాయతీని ఎవరూ శంకించలేరని, యోగి పేరు వింటే నేరస్థులకు వణుకేనంటూ వ్యాఖ్యానించారు. యూపీలోని మహారాజ్గంజ్లో ఏర్పాటు చేసిన యోగి ఆదిత్యనాథ్కు మత గురువైన అవైద్యనాథ్ విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగి తన గురువు చూపిన బాటలోనే నడుస్తున్నారన్నారు. ఆయన బహుళ పాత్రలు పోషించగల వ్యక్తి అని.. సనాతన ధర్మంతో పాటు రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారని ప్రశంసించారు.
యోగి పేరు వింటే నేరస్థులకు వణుకు మొదలువుతుందని, వారి గుండె కొట్టుకొనే వేగం కూడా పెరుగుతుందన్నారు. యోగి నిజాయతీని ఎవరూ శంకించలేరని తెలిపారు. గోరఖ్పూర్ వర్శిటీలో తాను విద్యార్థిగా ఉన్నప్పటి జ్ఞాపకాలను, గోరఖ్నాథ్ పీఠ్ అధిపతిగా అవైద్యనాథ్ ఉన్నప్పుడు ఆయనతో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కూడా కొనియాడారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. రాజ్నాథ్ సింగ్ ప్రధానితో కలిసి పనిచేస్తున్నారని, దేశ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నారని కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా సీనియర్ నేత సుశీల్కుమార్ కన్నుమూత
భాజపా సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ (72) కన్నుమూశారు. దీర్ఘకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ vs లఖ్నవూ.. నేటి మ్యాచ్ ఫలితం ప్లేఆఫ్స్పై ప్రభావమెంత..?
-
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
-
60 ఏళ్లు మించొద్దు.. వేతనం ఇలా - హెడ్ కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
-
సైన్యంపై ఎదురు తిరిగిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!