Andhra News: మహానాడుకు వచ్చిన జనాన్ని చూస్తే వాళ్ల గుండె ఆగుతుంది: అయ్యన్న

ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు వచ్చిన జనాలను చూస్తే వైకాపా నాయకుల గుండె ఆగిపోతుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు.

Published : 01 Jun 2022 12:25 IST

తిరుమల: ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు వచ్చిన జనాలను చూస్తే వైకాపా నాయకుల గుండె ఆగిపోతుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అరాచక పాలన అంతానికి మహానాడు సభ నాంది అని చెప్పారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో అయ్యన్న కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

తిరుమలలో లేనిపోని ఆంక్షలతో తితిదే భక్తులను ఇబ్బందులు పెడుతోందని.. శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తుల నిలువు దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చర్యల వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని విమర్శించారు. మహానాడును అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు 150 ఎకరాల పంట పొలాలిచ్చి సభను విజయవంతం చేశారని అయ్యన్న చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని