YSRCP: అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి హల్‌చల్‌..

ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యం చేశారు.

Updated : 28 Apr 2024 12:33 IST

ఆత్మకూరు: రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డితో పాటు హల్‌చల్ చేశారు. తెదేపా సానుభూతిపరులైన ఎస్సీలు, వాల్మీకుల ఇళ్లపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే గ్రామంలోనే ఉంటూ తెదేపాకు ఎలా మద్దతు తెలుపుతారంటూ గ్రామానికి చెందిన వనూరప్పా, లింగమయ్యలపై రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడులు చేశారు. వెంటనే తెదేపాను వీడి వైకాపాలో చేరాలంటూ ఒత్తిడి చేశారు. ఈ బెదిరింపులను గ్రామ యువకుడు చిత్రీకరించాడు. దీంతో అతడి ఫోన్‌ లాక్కోవడానికి ప్రయత్నించారు. అనంతరం స్థానికంగా ఉన్న తెదేపా కార్యకర్తలు, వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలందరూ ఏకమై తెదేపా కార్యకర్తలకు అండగా నిలిచారు. దీంతో రాజశేఖర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా: పరిటాల సునీత

దాడి జరుగుతోందని రాత్రి ఫోన్‌ చేసినా ఇటుకలపల్లి సీఐ స్పందించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌కు తెదేపా నేత, మాజీ మంత్రి పరిటాల సునీత ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. జిల్లా పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. తోపుదుర్తిలో తెదేపా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని గతంలోనూ పోలీసుల దృష్టికి ఆమె తీసుకెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని