Anantapur: తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి

అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది.

Updated : 29 Apr 2024 00:20 IST

కుందుర్పి: అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ప్రచార రథానికి తగిలిన రాళ్లు పక్కకు పడిపోయాయి. ఒక రాయి ప్రచార రథానికి తగిలి.. పక్కనే ఉన్న విద్యార్థి వీరేష్‌ నుదుటిపై పడటంతో గాయమైంది. దీంతో వెంటనే విద్యార్థికి ప్రథమ చికిత్స అందించారు. రాళ్లదాడి ఘటనతో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వైకాపా అల్లరి మూకలను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వారు పరారయ్యారు. రాళ్లదాడిలో గాయపడిన విద్యార్థితో పాటు అతడి తల్లిదండ్రులు, తెదేపా నాయకులు కుందుర్పి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఘటనపై ఫిర్యాదు చేశారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని