WI vs IND: సోషల్ మీడియాలో విమర్శించడం తేలికే.. విండీస్తో టీ20 సిరీస్ ఓటమిపై స్పందించిన అశ్విన్
వెస్టిండీస్తో టీ20 సిరీస్లో ఓటమిపాలుకావడంతో టీమ్ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: విండీస్పై (WI vs IND) టెస్టు, వన్డే సిరీస్లను అలవోకగా కైవసం చేసుకున్న టీమ్ఇండియా (Team India) టీ20 సిరీస్లో మాత్రం తడబడింది. ఐదు టీ20ల సిరీస్ని 3-2 తేడాతో చేజార్చుకుని విమర్శలపాలవుతోంది. గతేడాది టీ20 ప్రపంచకప్నకు అర్హత కూడా సాధించని విండీస్ చేతిలో సిరీస్ను కోల్పోవడంపై ఏంటని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఫైరవుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆసియా కప్, తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో టీమ్ఇండియా ఫామ్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో భాగమైన రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. టీ20 సిరీస్ ఓటమిపై వస్తున్న విమర్శలపై స్పందించాడు. సోషల్ మీడియాలో విమర్శించడం తేలికే అని.. ఈ సిరీస్తో భారత్కు ఎన్నో సానుకూలతలు ఉన్నాయని పేర్కొన్నాడు.
టీ20లంటే పూనకమే... పొట్టి క్రికెట్ ప్రమాదకారి విండీస్
‘‘ఈ టీ20 సిరీస్లో భారత్కు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. గత టీ20 ప్రపంచ కప్నకు అర్హత సాధించని టీమ్ (వెస్టిండీస్)తో ఓడిపోవడం వల్ల సోషల్ మీడియాలో జట్టు(టీమ్ఇండియా)ను విమర్శించడం చాలా సులభం. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. వారు (విండీస్) రాబోయే వన్డే ప్రపంచకప్నకు కూడా అర్హత సాధించలేదు. నేను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదు. మద్దతుగా మాట్లాడటం లేదు. ఈ విషయాలు అంత ముఖ్యమైనవి కావు. యువ ఆటగాడిగా వెస్టిండీస్కు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని సవాళ్లు ఉంటాయి. అన్ని దేశాలలో కొన్ని సహజ రహస్యాలు ఉంటాయి. పర్యాటక దేశ ఆటగాళ్ల కంటే స్థానిక ఆటగాళ్లకు ఈ విషయాలు ఎక్కువగా తెలిసుంటాయి.
నేను వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు రకరకాల చిన్న చిన్న విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. క్రికెటర్గా నాకు ఇవే మొదటి అనుభవం. ఈ పర్యటనలో యువ ఆటగాళ్లు ఎంతో నేర్చుకున్నారు. వారు మరోసారి విండీస్కు వెళ్లినప్పుడు మంచి ప్రదర్శన కనబరుస్తారు. వెస్టిండీస్తో టీ20 సిరీస్ను 3-2 తేడాతో ఓడిపోవడంతో టీమ్ఇండియాపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చేయడం సరైందే అనుకుంటున్నా. కానీ, మనం ఈ ఓటమిని రెండు కోణాల్లో చూడాలి. ఈ సిరీస్తో ఆటగాళ్లు అనుభవాన్ని పొందారు’’ అని అశ్విన్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
41 ఏళ్ల ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్తో తనకు బలమైన బంధం ఉందని గంభీర్ వెల్లడించాడు. ఏ నిర్ణయం తీసుకొన్నా జట్టు శ్రేయస్సు కోసమేనని అతడు నమ్ముతాడన్నాడు. -
ఓడినా.. గెలిచినా పట్టించుకోరు.. ధోనీ ఎంటర్టైన్ చేస్తున్నాడంతే: సెహ్వాగ్
ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్లో చెన్నై మ్యాచ్లను చూసేందుకు వస్తున్నారు. అతడు కూడా వారిని నిరాశపర్చకుండా దూకుడుగా ఆడేస్తున్నాడు. -
అందరి సారథ్యం ఒకేలా ఉండదు.. మా కెప్టెన్ చాలా మంచోడు: ముంబయి పేసర్
హార్దిక్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వస్తున్న క్రమంలో ముంబయి బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ సారథి అత్యుత్తమమని వ్యాఖ్యానించాడు. -
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
ఐపీఎల్ 17వ సీజన్లో వేటు ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడటంతో సస్పెన్షన్ తప్పలేదు. -
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
మరో కీలక పోరులో ముంబయిని ఢీకొట్టేందుకు కోల్కతా సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ అభిమాని నుంచి గౌతమ్ గంభీర్కు ప్రత్యేక విజ్ఞప్తి అందింది. -
ఒక్కటీ క్వాలిఫై కాకపాయె.. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరమాయె!
ప్రస్తుత ఎడిషన్లో నాకౌట్ దశకు చేరుకొనే జట్టు ఏంటనేది ఇంకా తెలియలేదు. టాప్-4లోకి వస్తాయని అనుకుంటున్న జట్లకు పాయింట్ల పట్టికలో కింద ఉన్న టీమ్లు షాక్లు ఇస్తున్నాయి. -
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
ఒక్క మ్యాచ్లో తమ జట్టు ఓడిపోవడంతో కెప్టెన్పై ఫ్రాంచైజీ యజమాని అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ అనుభవం కేఎల్ రాహుల్కు ఎదురైంది. -
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా
గెలిచామనే ఆనందం గుజరాత్కు లేకుండా పోయింది. ఆ జట్టు సారథి గిల్తోపాటు ఆటగాళ్లకు భారీ జరిమానాను విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. -
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
ఐపీఎల్కు రోహిత్ గుడ్బై చెప్పనున్నట్లు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలైంది. దీనంతటికి కేకేఆర్ పోస్టు చేసిన ఓ వీడియో కారణమైంది. -
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
గుజరాత్ చేతిలో ఓటమితో చెన్నై తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతానికి నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. మిగతా మ్యాచుల్లోనూ గెలిస్తేనే బెర్తు దక్కే అవకాశం ఉంటుంది. -
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ పేసర్
-
యమునోత్రికి పోటెత్తిన భక్తులు.. బారులు తీరిన దృశ్యాలు వైరల్
-
నేను ఏ నిర్ణయం తీసుకొన్నా షారుక్ మద్దతు ఉంటుంది: గంభీర్
-
ఓటర్ల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: ఎండీ ద్వారకా తిరుమలరావు
-
కడుపు కోతలో తల్లిదండ్రులు.. చిన్నారి మృతదేహాన్ని వదిలేసిన విమాన సిబ్బంది
-
లింక్డ్ఇన్లో పోస్ట్ డిలీట్.. మైక్రోసాఫ్ట్తో ఓలా కటీఫ్