AUS vs IND: అభిషేక్‌ శర్మ ఒంటరి పోరాటం.. ఆసీస్‌ విజయ లక్ష్యం 126

Eenadu icon
By Sports News Team Updated : 31 Oct 2025 15:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌ వేదికగా రెండో టీ20లో తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ, హర్షిత్‌ రాణా మాత్రమే రాణించారు. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (68; 37 బంతుల్లో 8 ఫోర్లు,  2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. హర్షిత్‌ రాణా (35; 33 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్‌) చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు.

గిల్‌ (5), సంజు శాంసన్‌ (2), సూర్యకుమార్ యాదవ్‌ (1), తిలక్‌ వర్మ (0), అక్షర్‌ పటేల్‌ (7), శివమ్‌ దూబె (4) విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హేజిల్‌వుడ్ 3, జేవియర్‌ బ్రేట్‌లెట్‌, నాథన్‌ ఎల్లిస్‌ తలో 2, మార్కస్‌ స్టాయినిస్‌ 1 వికెట్‌ తీసుకున్నారు.

Tags :
Published : 31 Oct 2025 15:38 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు