Womens Team India: వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమ్ఇండియా రూ.39 కోట్ల ప్రైజ్మనీని సొంతం చేసుకుంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన ఛాంపియన్గా అవతరించింది. మిథాలీరాజ్ నాయకత్వంలో రెండుసార్లు ఫైనల్కు వెళ్లినా ఓటమి తప్పలేదు. ఈసారి ఎలాంటి పొరపాటు లేకుండా సఫారీ జట్టును చిత్తు చేసి భారత్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. బీసీసీఐ కూడా జట్టుకు భారీ నజరానా ప్రకటించడం విశేషం. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘బీసీసీఐ కార్యదర్శిగా జైషా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి (2019-24) భారత మహిళా క్రికెట్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. ఇక ఐసీసీ ఛైర్మన్గా జైషా ప్రపంచ కప్ ప్రైజ్మనీ విషయంలోనూ ప్రత్యేకంగా నిలిచారు. పురుషుల జట్టు కంటే ఎక్కువ ప్రైజ్మనీని అందించారు. ఇప్పుడు ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు బీసీసీఐ నుంచి రూ.51 కోట్ల నజరానా ఇస్తున్నాం. దీన్ని ప్లేయర్లు, కోచ్లు, సహాయక సిబ్బందికి అందజేస్తాం. 1983లో కపిల్దేవ్ నాయకత్వంలో టీమ్ఇండియా తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గింది. అప్పటినుంచి దేశంలో క్రికెట్కు విపరీతమైన ఆదరణ దక్కింది. ఇప్పుడు అమ్మాయిలు కూడా అద్భుతం చేసి చూపించారు. భవిష్యత్తులో మరింతమంది మహిళలు ఆటను ఎంచుకోవడానికి ఇదొక పునాదిగా మారుతుంది’’ అని వెల్లడించారు.
ఎంతో స్ఫూర్తిగా నిలిచారు: జైషా
‘‘తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు. ధైర్యసాహసాలు, సంకల్పం, నైపుణ్యాలు దేశానికి స్ఫూర్తి ఇచ్చినప్పటికీ.. బీసీసీఐ తీసుకున్న కీలక విధాన నిర్ణయాల పాత్రను మనం గుర్తించాలి. మహిళా క్రికెట్లోనూ పెరిగిన పెట్టుబడులు, పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాలు, కోచింగ్ సిబ్బంది పునర్నిర్మాణం.. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’’ అని ఐసీసీ ఛైర్మన్ జైషా పోస్టు పెట్టారు.
దేశం గర్వపడేలా చేశారు: నీతా అంబానీ
‘‘ఆదివారం రాత్రి మన అమ్మాయిలు తొలిసారి ప్రపంచకప్ నెగ్గారు. దేశమంతా గర్వంతో ఉప్పొంగేలా చేశారు. మీరు ఆడిన తీరు భావితరాలకు స్ఫూర్తి. ఆత్మవిశ్వాసం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సాగిన ఆటతీరు అద్భుతం. ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. - 
                                    
                                        

కల తీరెలే కప్పందగా..
భారత్ ఇన్నింగ్స్లో ఓపెనర్ షెఫాలి వర్మ ఆటే హైలైట్. ప్రతీక రావల్ గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆమె.. తన తొలి మ్యాచ్లో విఫలమైనా ఈసారి అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకుంది. - 
                                    
                                        

వచ్చింది.. గెలిపించింది
వారం ముందు ఆ అమ్మాయి అందరిలాగే ప్రపంచకప్ వీక్షకురాలు. టీవీలో భారత జట్టు ఆట చూస్తూ ఉంది. కానీ ఉన్నట్లుండి అంతా మారిపోయింది. ఆమె టీవీ లోపలికి వెళ్లిపోయింది. భారత జట్టులో సభ్యురాలై ప్రపంచకప్లో ఆడేసింది. - 
                                    
                                        

కొత్త బంగారు లోకం
ప్రయాణ ఖర్చుల కోసం చందాలు వేసుకోవడం దగ్గర్నుంచి.. కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందే వరకు! రోడ్డు మీద వెళ్తుంటే ఎవ్వరూ పట్టించుకోని స్థితి నుంచి.. రక్షణ వలయం లేకుండా బయటికి వెళ్లలేని దశ వరకు! ప్రత్యక్ష ప్రసారమే లేని రోజుల నుంచి. - 
                                    
                                        

మన వనిత.. విశ్వవిజేత
ఆట ఏదైనా ప్రపంచకప్ అంటే.. ఆడే ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవాలనుకునే స్వప్నం. ఈ దేశంలో బ్యాటు, బంతి పట్టిన ప్రతి అమ్మాయీ దశాబ్దాలుగా ఆ కలను కంటూనే ఉంది. 1978 నుంచి భారత జట్టు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారీ నిరాశే. - 
                                    
                                        

హర్మన్ డెవిల్స్
అప్పట్లో కపిల్ నేతృత్వంలో పురుషుల క్రికెట్లో దేశానికి తొలి ప్రపంచ కప్ను అందించిన జట్టును ‘కపిల్ డెవిల్స్’ అన్నారు. అసలు అంచనాలే లేకుండా అద్వితీయ ప్రదర్శన చేస్తూ అరివీర భయంకర వెస్టిండీస్ను ఓడించి 1983లో అద్భుతం చేసింది ఆ భారత జట్టు. - 
                                    
                                        

దొరికింది ఓ ఆణిముత్యం
భారత జట్టుకు ఆడడం ఏ ప్లేయర్కైనా పెద్ద కల. అలాంటిది ప్రపంచకప్లో బరిలో దిగే అవకాశం వస్తే! అందులోనూ అరంగేట్రం చేసిన కొన్ని నెలలకే ఈ అవకాశాన్ని అందుకుంటే! ఆ అదృష్టం తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. - 
                                    
                                        

మహిళల క్రికెట్లో మలుపు
వన్డే ప్రపంచకప్లో భారత్ విజయం యావత్ మహిళల క్రికెట్ను మార్చబోతోందని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడింది. 1983లో కపిల్ సేన విజయం ప్రపంచ క్రికెట్ను మార్చినట్లుగానే.. - 
                                    
                                        

మనకొకటి..
అర్ష్దీప్ జట్టులో ఉండాలి.. గత కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్ ఇది. ఆస్ట్రేలియాతో సిరీస్లో 0-1తో వెనకబడిన దశలో అతడికి చోటు లభించింది. ఆ అవకాశాన్ని అతడు వమ్ము చేయలేదు. - 
                                    
                                        

అప్పుడు కపిల్.. ఇప్పుడు అమన్
దక్షిణాఫ్రికా గెలవాలంటే 54 బంతుల్లో 79 పరుగులు చేయాలి. అయినా ఆ జట్టు ధీమాగా ఉంది. సెంచరీ చేసిన కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇంకా క్రీజులో ఉండడమే ఇందుకు కారణం. - 
                                    
                                        

టీ20లకు విలియమ్సన్ వీడ్కోలు
న్యూజిలాండ్ దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ టీ20లకు వీడ్కోలు పలికాడు. కివీస్ తరఫున 93 టీ20లు ఆడిన కేన్.. 2575 పరుగులు సాధించాడు. 2011లో జింబాబ్వేపై పొట్టి క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ బ్యాటర్. - 
                                    
                                        

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
మహిళల ప్రపంచకప్ (Womens World Cup)లో భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. - 
                                    
                                        

మహిళల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్
ముంబయి వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ సేన 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) చెలరేగారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
 - 
                                    
                                        

ప్రపంచకప్ మనదే.. చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు
భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారి టీమ్ఇండియా ప్రపంచకప్ను ఒడిసిపట్టుకుంది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
 - 
                        
                            

భారతీయులంతా మీకు వందనం చేస్తున్నారు : టీమ్ఇండియాపై సినీ సెలబ్రిటీల ప్రశంసలు
 - 
                        
                            

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
 - 
                        
                            

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి
 - 
                        
                            

బాపట్ల జిల్లాలో కారు, లారీ ఢీ.. నలుగురు మృతి
 


