AUS vs IND: రెండో టీ20 ఆసీస్‌దే.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపు

Eenadu icon
By Sports News Team Updated : 31 Oct 2025 17:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెల్‌బోర్న్‌ వేదికగా టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20లో కంగారూ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ తొలి నుంచీ దూకుడుగానే ఆడింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (46; 26 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అతడు ఔట్‌ కావడానికి ముందు రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. 7.6 ఓవర్‌లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో అభిషేక్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (28; 15 బంతుల్లో, 1 ఫోర్‌) క్రీజులో ఉన్నంత వరకు దూకుడుగానే ఆడాడు. జోస్‌ ఇంగ్లిస్‌ (20; 20 బంతుల్లో, 1 ఫోర్‌) ఫర్వాలేదనిపించాడు. 

భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్‌లో రాణించిన హర్షిత్‌ రాణా.. బౌలింగ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఆఖర్లో భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసుకున్నప్పటికీ ఆసీస్‌ను మాత్రం నిలువరించలేకపోయారు.

Tags :
Published : 31 Oct 2025 17:14 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని