INDw vs AUSw: ‘కంగారూ’ను జయిస్తేనే ఫైనల్కు..

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచ కప్ (ICC Womens World Cup 2025) ఆఖరి దశకు చేరుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమ్ఇండియా (Team India).. ఆశించిన మేరకు ప్రదర్శన చేయకపోయినా కాస్త అదృష్టం తోడవడంతో నాలుగో స్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించింది. వర్షం అంతరాయంతో టోర్నీలో ఇతర జట్లకు సంబంధించిన చాలా మ్యాచ్లు రద్దు కాగా.. భారత్ ఏడు పాయింట్లతో నాకౌట్ దశకు క్వాలిఫై అయింది. కానీ, ఇక్కడితో సంబరపడొద్దు. అసలు సిసలు పరీక్ష ముందుంది. ఇప్పటివరకు రెండుసార్లు ఫైనల్ చేరినా కప్పు కలను సాకారం చేసుకోలేకపోయిన టీమ్ఇండియా.. మూడోసారి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలంటే ముందుగా ‘కంగారూ’ను జయించాలి. అక్టోబర్ 30న జరిగే రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాను హర్మన్ప్రీత్ సేన అమీ తుమీ తేల్చుకోనుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా (Australia)ను ఓడించడం భారత్కు అంత తేలిక కాదు. ఇప్పటికే లీగ్ దశలో కంగారూలతో జరిగిన మ్యాచ్లో భారత్ 330 పరుగులు చేసినా లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఎల్లిస్ పెర్రీ, ఆష్లీన్ గార్డ్నర్, ఫోబ్ లిచ్ఫీల్డ్, బెత్ మూనీలతో ఆ జట్టు బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. వీరంతా ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపుతిప్పగల సత్తా ఉన్నవాళ్లే. సూపర్ ఫామ్లో ఉన్న ఆసీస్ కెప్టెన్ అలీసా హీలీ భారత్తో సెమీస్ మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది భారత్కు ఉపశమనాన్ని ఇచ్చే అంశం. బౌలింగ్లో ప్రధానంగా అలానా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్తో భారత్కు ముప్పుంది. సోఫీ మోలినెక్స్, ఆష్లీన్ గార్డ్నర్ కూడా బంతితో రాణిస్తే టీమ్ఇండియాకు ఇబ్బందులు తప్పవు. సెమీస్కు ముందు ఫామ్లో ఉన్న ప్రతీక రావల్ గాయంతో టోర్నీకి దూరమవడం భారత్కు ప్రతికూలంగా మారింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, హర్మన్ప్రీత్ సింగ్, దీప్తి శర్మ, రిచా ఘోష్లతో పేపర్ మీద టీమ్ఇండియా బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నా వీరు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. క్రాంతి గౌడ్, శ్రీచరణి, దీప్తి, రేణుకా సింగ్ బంతితో మెరిస్తే ఆసీస్కు షాకిచ్చి ఫైనల్కు దూసుకెళ్లడం ఖాయం!
మహిళల క్రికెట్లో ఇప్పటిదాకా 12 వన్డే ప్రపంచకప్లు జరగ్గా.. భారత్ నాలుగుసార్లు సెమీస్కు చేరింది. ప్రస్తుతం జరుగుతోన్న 13వ ఎడిషన్లో భారత్ మరోసారి నాకౌట్ దశకు అర్హత సాధించగలిగింది. 1997లో ఆస్ట్రేలియా, 2005లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2005లో కివీస్ని 40 పరుగుల తేడాతో మట్టికరిపించిన మిథాలి రాజ్ సేన.. తుది పోరులో ఆస్ట్రేలియా జోరు ముందు నిలవలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. 2017లో కప్పు గెలిచేందుకు భారత అమ్మాయిలకు మంచి అవకాశమే వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. సెమీస్లో భీకర ఆస్ట్రేలియాను ఓడించిన భారత్.. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి విశ్వవిజేతగా నిలిచే ఛాన్స్ను మిస్ చేసుకుంది. ఇప్పుడు టైటిల్కు మరో రెండు అడుగుల దూరంలో నిలిచిన టీమ్ఇండియా.. సెమీస్లో ‘ఆస్ట్రేలియా’ గండాన్ని దాటితే.. ఫైనల్లో ఇంగ్లాండ్ లేదా సౌతాఫ్రికాతో తలపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

భారత్తో చివరి రెండు టీ20లకు ట్రావిస్ హెడ్ దూరం
భారత్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్లకు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) దూరం కానున్నాడు. - 
                                    
                                        

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియా (Team India) విజేతగా నిలవడంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. - 
                                    
                                        

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
చాలామంది ఎంత కష్టపడ్డా కాలం కలిసి రాకో.. పరిస్థితుల ప్రభావం వల్లో జీవితంలో అనుకున్నది సాధించరు. కానీ, కొంతమంది అంతటితో కుంగిపోరు. - 
                                    
                                        

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్లు.. వ్యాపారి గిఫ్ట్
Women's World Cup: ప్రపంచకప్ నెగ్గిన భారత మహిళా క్రికెటర్లకు వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు సూరత్ వ్యాపారి ప్రకటించారు. - 
                                    
                                        

కప్పు గెలిచినా.. మిమ్మల్ని ఎప్పటికీ మరవం..
2025 మహిళల వన్డే ప్రపంచ కప్లో హర్మన్ప్రీత్ సేన ఛాంపియన్గా నిలిచి భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించింది. - 
                                    
                                        

‘మా కూతురు.. అబ్బాయిలతో క్రికెట్ ఆడేది’
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సిమ్లాకు చెందిన రేణుక సింగ్ ఠాకూర్ కీలక బౌలర్. ఆమెకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణమని ఆమె తల్లి సునీత వివరించారు. తన భర్తకు కూడా రేణుకను క్రికెటర్గా చూడాలని ఆశగా ఉండేదని ఆమె తెలిపారు. - 
                                    
                                        

కెప్టెన్ హర్మన్.. విమర్శలను అధిగమించి.. జగజ్జేతగా నిలిపి!
హర్మన్ ప్రీత్ కౌర్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కానీ, వన్డే ప్రపంచ కప్ టోర్నీకి కొన్ని రోజుల ముందు ఆసీస్తో స్వదేశంలో వన్డే సిరీస్ను భారత్ కోల్పోయింది. అప్పుడు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒకదశలో హర్మన్ను సారథ్యం నుంచి తప్పించాలనే డిమాండ్లూ వచ్చాయి. వాటన్నింటికీ సమాధానం ఈ వరల్డ్ కప్. - 
                                    
                                        

అవమానాలు దాటి.. కూతుర్ని పంపి: నాన్న దిద్దిన ‘దీప్తి’..!
Deepti Sharma: దీప్తిశర్మ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు విజయం కట్టబెట్టింది. ఆమె క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఆమె కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. - 
                                    
                                        

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
భారత జట్టు ప్రయోగించిన ఓ అస్త్రం తమ విజయాన్ని అడ్డుకుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ తెలిపింది. - 
                                    
                                        
ఫైనల్కు ముందు సచిన్తో చాట్.. అంతా మార్చేసింది: షెఫాలి వర్మ
Shafali Verma: మ్యాచ్కు ముందు సచిన్తో మాట్లాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని షెఫాలి వెల్లడించింది. - 
                                    
                                        

అమ్మాయిల పట్టు.. బంతి చేయి దాటితే ఒట్టు..!
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింట్లో ఏది విఫలమైనా ఛాంపియన్గా నిలవడం కష్టం. కానీ, భారత మహిళా జట్టు మాత్రం మూడింట్లోనూ సత్తా చాటింది. - 
                                    
                                        

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్ప్రీత్
తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన అనంతరం హర్మన్ప్రీత్ బంతిని పాకెట్లో భద్రంగా దాచిపెట్టుకొన్న తీరు క్రికెట్ అభిమానులకు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ను గుర్తు చేసింది. - 
                                    
                                        

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్ప్రీత్
మైదానంలో హర్మన్ప్రీత్ తన గురువు కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. - 
                                    
                                        

‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ను నెగ్గడంపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమ స్పందనను తెలియజేశారు. - 
                                    
                                        

ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్ ఫొటోలు వైరల్
Womens World Cup: వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిల జట్టు ఆనందంలో మునిగితేలుతోంది. - 
                                    
                                        

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. హర్మన్ సేనకు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 - 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 


